ప్రధానితో వైసీపీ ఎంపీల సమావేశం - బీసీ జనగణనపై వినతి..!!
వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధానితో సమావేశమైన వైసీపీ ఎంపీలు జనాభా లెక్కలలో బీసీ జనగణన చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి అ మేరకు ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. దేశంలో 53 శాతం మంది బీసీలు ఉన్నారని వారు ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అయినప్పటికీ బీసీలను ను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
బీసీ జనగణన చేయాలని.. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని పేర్కొన్నారు. పార్లమెంటు శాసనసభ న్యాయవ్యవస్థలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు ప్రధానిని అభ్యర్ధించారు. ఇదే అంశం పైన గతంలో ఏపీ అసెంబ్లీలోనూ తీర్మానం చేసారు. జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా బీసీల గణన చేపట్టాలని కోరుతున్నారు. అయతే కేంద్రం మాత్రం ఈ అంశంపై స్పందించడం లేదు.

బీసీ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఏపీ ప్రభుత్వం బీసీ జనగణనకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అందుకే కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు తీర్మాన సమయంలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రధానితో సమావేశమైన సమయంలోనూ వైసీపీ ఎంపీలు అసెంబ్లీ తీర్మానంతో పాటుగా అన్ని అంశాలను ప్రధానికి వివరించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications