ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు- ఈసీకి వైసీపీ, టీడీపీ ఫిర్యాదులివే..!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియ సాగిస్తోంది. దీంతో పాటు రెండు రోజులుగా రాష్ట్రంలో ఈసీ అధికారులు పర్యటించడంతో పాటు అధికారులు, రాజకీయ పార్టీలతో వరుస భేటీలు
నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు పరస్పరం ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు. ఓటర్ల జాబితాల్లో నకిలీ ఓట్లు, ఓట్ల తొలగింపు, తెలంగాణ-ఏపీలో ఓట్లు కలిగి ఉండటం వంటి ఫిర్యాదుల్ని ఈసీ ముందు ఇరు పార్టీలు ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై తగు చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు వారికి హామీ ఇచ్చి పంపుతున్నారు. ఇవాళ కూడా ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగింది.

గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు ఇవ్వడం, ఒకే వ్యక్తి 100 ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. చంద్రగిరి, పర్చూరు, కాకినాడ, వినుకొండ లాంటి 7 నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించాలని కోరామన్నారు. ఏపీకి జగనన్న ఎందుకు కావాలి ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనని బీఎల్వోలకు మెమోలు ఇచ్చిన విషయం కూడా తెలిపారు.
అధికారులు కులసంఘాల మీటింగ్ లకు వెళ్తున్న అంశంపైనా ఫిర్యాదు చేశామన్నారు.
మరోవైపు టీడీపీ-జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వైసీపీ ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు చేశారు.తెలంగాణ లో ఉన్న ఓటర్లు ఇక్కడ కూడా ఓటు కలిగి ఉండటాన్ని పరిశీలించాలని కోరామన్నారు. తెలంగాణ లో ఓటు ఉండగా ఏపీలో ఓటు నమోదు చేసుకుంటున్న విషయాన్ని ఈసీఐ దృష్టికి తీసుకెళ్ళామన్నారు.
టీడీపీకి చెందిన కోనేరు సురేష్ అనే వ్యక్తి దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని పేర్ని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారన్నారు. కోనేరు సురేష్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. టీడీపీకి చెందిన మై పార్టీ డాష్ బోర్డులో ఓటర్ల వ్యక్తిగత సమాచారం అంతా ఉంటుందని,టీడీపీ మేనిఫెస్టో ప్రచారం తో చంద్రబాబు సంతకం తో లెటర్లు ఇస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని పేర్ని తెలిపారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications