మరో జాబ్ మేళాకు సిద్ధమైన వైసీపీ-ఈసారి నాగార్జున వర్సిటీలో-మే 7,8 తేదీల్లో
ఏపీలో వైసీపీ తరఫున వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్న జగన్ సర్కార్ ఇప్పుడు వరుసగా మూడో మేళాకు సిద్ధమైంది. ఇప్పటికే తిరుపతి, వైజాగ్ లో రెండు ప్రాంతీయ జాబ్ మేళాల్ని విజయవంతంగా నిర్వహించిన వైసీపీ.. ఇఫ్పుడు గుంటూరులో మూడో ప్రాంతీయ జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. దీని వివరాలను ఇవాళ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
గుంటూరులో మే నెల 7,8 తేదీల్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జగన్ ఆదేశాల మేరకు ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన జాబ్మేళాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని, ఇప్పుడు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మే 7, 8న మూడో జాబ్మేళా నిర్వహిస్తున్నామని సాయిరెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

మూడు జాబ్మేళాల్లో (తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు)మొత్తం 15 వేల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయితే తొలి రెండు కార్యక్రమాల్లోనే ఆ లక్ష్యాన్ని మించి, 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే జాబ్మేళా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఆ కార్యక్రమానికి 208 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయన్నారు. జాబ్మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారి కనీస వేతనం రూ.15 వేలు కాగా, గరిష్ట వేతనం లక్షకు పైనే ఉందని సాయిరెడ్డి తెలిపారు. ఐటీ రంగంలోనూ అత్యధిక ఉద్యోగాలు లభిస్తున్నాయని విపక్షాలకు గుర్తుచేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్శటీలో నిర్వహించే బాజ్మేళాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.ఇప్పటికే ఈ జాబ్మేళాకు 77వేల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా మిగలకూడదని అంత వరకు ఈ జాబ్ మేళా కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారని సాయిరెడ్డి తెలిపారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications