మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై జీరో ఎఫ్ఐఆర్.. షాకిస్తున్న కేసులు, నేడు కోర్టులో మధ్యంతరబెయిల్పై విచారణ!!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పైన తాజాగా మళ్లీ కేసు నమోదు కావడంతో పిన్నెల్లి బ్రదర్స్ ఇరకాటంలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాచర్ల లోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన తోపాటు సిఐ పై దాడి చేశారన్న కారణంతో వారిపైన రెండు కేసులు నమోదయ్యాయి.
ఆపై తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు పై దాడి చేసిన ఘటన, మహిళను దుర్భాషలాడిన ఘటన పైన కూడా పోలీసులు వీరిద్దరిపైన కేసు నమోదు చేశారు. ఇక తాజాగా పిన్నెల్లి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఒక టీడీపీ కార్యకర్త పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వారిపైన జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

ప్రాణ హాని ఉందని టీడీపీ కార్యకర్త ఫిర్యాదు
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన నోముల మాణిక్యరావు తన న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి ఆదివారం సాయంత్రం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొదట పిటీషన్ తిరస్కరించిన మంగళగిరి రూరల్ పోలీసులు
పోలింగ్ కేంద్రంలో టిడిపి ఏజెంట్ గా పని చేసిన నోముల మాణిక్యరావు తనను చంపడానికి పిన్నెల్లి బ్రదర్స్ నలుగురిని పెట్టారని, తాను మాచర్లకు వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అయితే ఫిర్యాదు అక్కడ తీసుకోవడం కుదరదు అంటూ మంగళగిరి రూరల్ పోలీసులు తిరస్కరించారు.
డీజీపీ చొరవతో నమోదైన జీరో ఎఫ్ఐఆర్
దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి డిజిపిని ఆదివారం రాత్రి కలిశారు. చివరకు డిజిపి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు కేసును నమోదు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన నుండి నిన్న రాత్రి ఫిర్యాదును స్వీకరించారు. నోముల మాణిక్యరావు ఎన్నికల పోలింగ్ నాడు కండ్లకుంట గ్రామంలో దారుణ ఘటనలను ఆయన పోలీసులకు వివరించారు.
బెయిల్ కోసం కోర్టుకెళ్ళిన పిన్నెల్లి.. నేడు విచారణ
ఇక ఈ కేసులలో ఇప్పటికే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా, పిన్నెల్లి విధించిన షరతులను ఉల్లంఘించారని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని కోర్టును కోరారు. ఆయనకు బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజున కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నారు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు .అయితే నేడు మరో మారు పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications