గర్ల్ ఫ్రెండ్తో ఆ పని చేస్తోండగా స్ట్రోక్, చనిపోయిన వృద్దుడు
బెంగళూరులో ఓ వృద్దుడి మృతి మిస్టరీగా మారింది. ఆ కేసు విచారణలో అసలు నిజం వెలుగుచూసింది. మృతుడు 67 ఏళ్ల బాల సుబ్రహ్మణ్యం అని.. అతను వ్యాపార వేత్త అని తేలింది. అయితే అతనికి హార్ట్ ఎటాక్ రావడంతో చనిపోయాడని తెలిసింది. తన గర్ల్ ఫ్రెండ్తో సెక్స్ చేస్తోన్న సమయంలో స్ట్రోక్ వచ్చిందట. ఇదే విషయాన్ని మెడికల్ రిపోర్ట్ తెలియజేసింది.
జేపీ నగర్లో గల పుత్తెనపల్లికి చెందిన బాలసుబ్రమ్మణ్యం.. పని మనిషితో సంబంధం ఉంది. నవంబర్ 16వ తేదీన తన మనుమడిని బ్యాడ్మింటన్ క్లాసులో దింపాడు. ఆ తర్వాత సాయంత్రం 4.55 గంటలకు తమ కోడలికి ఫోన్ చశాడు. తన పర్సనల్ వర్క్ ఉందని.. అందుకే లేట్ వస్తానని తెలిపారు. కానీ తర్వాత అతనిని ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేయలేకపోయారు. దీంతో వారు సుబ్రహ్మణ్య నగర్ పోలీసులను కాంటాక్ట్ అయ్యారు. కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో ఓ శవం కనిపించింది.
అయితే అతను పని మనిషి ఇంటికి వెళ్లాడట. ఆమెతో సెక్స్ చేసే సమయంలో స్ట్రోక్ వచ్చిందట. దాంతో అతను చనిపోగా ఆమె కంగారు పడిపోయింది. వెంటనే తన భర్తకు తెలియజేసింది. మరొకరి సాయంతో ప్లాస్టిక్ బ్యాగులో శవం రోడ్డు పక్కన వేశారు.
విచారణలో భాగంగా పోలీసులు పని మనిషిని కూడా ప్రశ్నించారు. దీంతో ఆమె నిజం అంగీకరించింది. తన భర్త సాయంతో డెడ్ బాడీ రోడ్డు పక్కన పడేశామని తెలిపారు. ఆమెతో చాలా కాల నుంచి అతనికి సంబంధం ఉంది. తరచుగా ఇంటికి వెళ్లేవాడట. ఆమెపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే మృతదేహం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఆమె చెప్పేది నిజమా కాదా అనే విషయం తేలనుంది. అతనికి ఆరోగ్యం కూడా బాగోలేదు. గత ఏడాది యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు.