Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎలక్షన్ టైమ్ లో ఏం జరిగింది ?, చెక్ పోస్టులో పోలీసును తొక్కించి చంపింది ఎవరు, లారీనా, లేక ఏదైనా?

గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. విధులు నిర్వహించడానికి వెళ్లిన పోలీసు ప్రాణం చెక్ పోస్ట్ సమీపంలోనే పోయింది.

బెంగళూరు/కలబురిగి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. విధులు నిర్వహించడానికి వెళ్లిన పోలీసు ప్రాణం చెక్ పోస్ట్ సమీపంలోనే పోయింది. ఆ సమయంలో చెక్ పోస్ట్ దగ్గర మరెవ్వరు లేరని వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం వరకు రోడ్డు ప్రమాదంలో పొలీసు చనిపోయిన ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు.

దీంతో రోడ్డుపై సంచరించిన వాహనదారులు సైతం ఆ పోలీసు గురించి పట్టించుకోలేదు. పోలీస్ కానిస్టేబుల్ కూడా సివిల్ డ్రెస్‌లో ఉండడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా ఎవ్వరూ అతని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు, మద్యం తాగి కిందపడి ఉంటాడని అందరూ పొరపాటుపడి ప్రమాదానికి గురైన పోలీసును పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో తీవ్రగాయాలైన అతను చనిపోయాడు.

కర్ణాటకలోని కలబురగి జిల్లా చిత్తాపూర్ తాలూకాలోని లడ్లాపూర్-డిగ్గీ తండా వద్ద రాత్రి షిఫ్టు సమయంలో చెక్ పోస్ట్ లో తనిఖీకి వెళ్లిన పోలీసు కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కలబురగి జిల్లా చిత్తపురా తాలూకా వాడి పోలీస్ స్టేషన్‌కు చెందిన కరియప్ప (37) అనే వ్యక్తి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

A vehicle rammed into a policeman at a check post, a constable who went on duty without being in uniform in Karnataka

లాడ్లాపూర్-డిగ్గీ తండా రహదారిపై ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ కరియప్ప ఇంట్లో భోజనం చేసి తరువాత చెక్ పోస్టు దగ్గర విధులు నిర్వహించడానికి బైక్ లో నలవార్ చెక్ పోస్ట్ వైపు వెళ్లాడు. ఉదయం స్థానికులు వెళ్లి చూసే సరికి రోడ్డు పక్కనే కరియప్ప రక్తపు మడుగులో పడి శవమై కనిపించాడు.

పోలీస్ కానిస్టేబు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కలబురగి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఇషా పంత్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై వాడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రమాదానికి గురైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్మగ్లింగ్, దొంగ సరుకు రవాణా చేసేవాళ్లు ఎవరైనా కానీస్టేబుల్ కరియప్ప మీద వాహనం ఎక్కించారా ? అని కూడా పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+