Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CD Girl: మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో ట్విస్ట్, పోలీసు అధికారుల మీద విచారణకు కోర్టు ఆదేశం !

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి సెక్స్ సీడీ కేసు అనుకోని మలుపుతిరిగింది. యువతి మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి అనుకూలంగా విచారణ చేసిన పోలీసులు కేసును నీరుకార్చారని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ తో పాటు డీసీపీ, సీఐ మీద విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఇప్పుడు సీడీ గర్ల్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే బీజేపీ నాయకులకు అనుకూలంగా పోలీసు అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. సీడీ గర్ల్ రాసలీలల కేసు విచారణ చేసిన పోలీసు అధికారుల మీద మరో విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

సీడీగర్ల్ రాసలీలల ఎఫెక్ట్

సీడీగర్ల్ రాసలీలల ఎఫెక్ట్

బెంగళూరులోని ఆర్ టీనగర్ లో నివాసం ఉంటున్న పీజీ గర్ల్ కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు రావడంతో బీజేపీ సీనియర్ నాయకుడు రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. చాలా నెలల నుంచి రమేష్ జారకిహోళి, సీడీగర్ల్ రాసలీలల కేసు విచారణ జరుగుతోంది.

కోర్టును ఆశ్రయించిన సామాజిక కార్యకర్త

కోర్టును ఆశ్రయించిన సామాజిక కార్యకర్త

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి అనుకూలంగా పోలీసు అధికారులు కేసు విచారణ చేస్తున్నారని, పోలీసు అధికారుల తీరుతో బాధితురాలికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త (ఆర్ టీఐ కార్యకర్త) దినేష్ కల్లళ్ళి బెంగళూరులోని 8వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసు అధికారుల మీద విచారణకు కోర్టు ఆదేశం

పోలీసు అధికారుల మీద విచారణకు కోర్టు ఆదేశం


సామాజిక కార్యకర్త పిటిషన్ విచారణ చేసిన బెంగళూరు 8వ ఏసీఎంఎం న్యాయస్థానం ఇరు వైపుల వాదనలు విన్నారు. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్, డీసీపీ అనుచేతన్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మారుతిల మీద మరు విచారణ చెయ్యాలని బెంగళూరు ఏసీఎంఎం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు.

మాజీ మంత్రికి అనుకూలంగా ఉన్నారని ?

మాజీ మంత్రికి అనుకూలంగా ఉన్నారని ?

పీజీ గర్ల్ మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి అనుకూలంగా విచారణ చేసిన పోలీసులు కేసును నీరుకార్చారని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ తో పాటు డీసీపీ అనుచేతన్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సీఐ మారుతి మీద విచారణకు బెంగళూరు ఏసీఎంఎం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఇప్పుడు సీడీ గర్ల్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది.

కోర్టునున ఆశ్రయించిన ఎస్ఐటీ

కోర్టునున ఆశ్రయించిన ఎస్ఐటీ


బెంగళూరు 8వ ఏసీఎంఎం కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఎస్ఐటీ విభాగానికి చెందిన ప్రసన్న కుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు కర్ణాటక హైకోర్టులో ఎస్ఐటీ సమర్పించిన అర్జీ విచారణ జరిగే అవకాశం ఉంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి సీడీ కేసు విచారణలో భాగంగా కర్ణాటక హైకోర్టు పిటిషన్ విచారణ చేసి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందో అంటూ రమేష్ జారకిహోళితో పాటు ఆయన ప్రత్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+