CD Girl: మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో ట్విస్ట్, పోలీసు అధికారుల మీద విచారణకు కోర్టు ఆదేశం !
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి సెక్స్ సీడీ కేసు అనుకోని మలుపుతిరిగింది. యువతి మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి అనుకూలంగా విచారణ చేసిన పోలీసులు కేసును నీరుకార్చారని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ తో పాటు డీసీపీ, సీఐ మీద విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఇప్పుడు సీడీ గర్ల్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే బీజేపీ నాయకులకు అనుకూలంగా పోలీసు అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. సీడీ గర్ల్ రాసలీలల కేసు విచారణ చేసిన పోలీసు అధికారుల మీద మరో విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

సీడీగర్ల్ రాసలీలల ఎఫెక్ట్
బెంగళూరులోని ఆర్ టీనగర్ లో నివాసం ఉంటున్న పీజీ గర్ల్ కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు రావడంతో బీజేపీ సీనియర్ నాయకుడు రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. చాలా నెలల నుంచి రమేష్ జారకిహోళి, సీడీగర్ల్ రాసలీలల కేసు విచారణ జరుగుతోంది.

కోర్టును ఆశ్రయించిన సామాజిక కార్యకర్త
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి అనుకూలంగా పోలీసు అధికారులు కేసు విచారణ చేస్తున్నారని, పోలీసు అధికారుల తీరుతో బాధితురాలికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త (ఆర్ టీఐ కార్యకర్త) దినేష్ కల్లళ్ళి బెంగళూరులోని 8వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసు అధికారుల మీద విచారణకు కోర్టు ఆదేశం
సామాజిక కార్యకర్త పిటిషన్ విచారణ చేసిన బెంగళూరు 8వ ఏసీఎంఎం న్యాయస్థానం ఇరు వైపుల వాదనలు విన్నారు. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్, డీసీపీ అనుచేతన్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మారుతిల మీద మరు విచారణ చెయ్యాలని బెంగళూరు ఏసీఎంఎం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు.

మాజీ మంత్రికి అనుకూలంగా ఉన్నారని ?
పీజీ గర్ల్ మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి అనుకూలంగా విచారణ చేసిన పోలీసులు కేసును నీరుకార్చారని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ తో పాటు డీసీపీ అనుచేతన్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సీఐ మారుతి మీద విచారణకు బెంగళూరు ఏసీఎంఎం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఇప్పుడు సీడీ గర్ల్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది.

కోర్టునున ఆశ్రయించిన ఎస్ఐటీ
బెంగళూరు 8వ ఏసీఎంఎం కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఎస్ఐటీ విభాగానికి చెందిన ప్రసన్న కుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు కర్ణాటక హైకోర్టులో ఎస్ఐటీ సమర్పించిన అర్జీ విచారణ జరిగే అవకాశం ఉంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి సీడీ కేసు విచారణలో భాగంగా కర్ణాటక హైకోర్టు పిటిషన్ విచారణ చేసి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందో అంటూ రమేష్ జారకిహోళితో పాటు ఆయన ప్రత్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications