CD Scandal: రాసలీలలు, పీజీ సుందరి కొత్త వీడియో కలకలం, మాట తప్పను, మడమ తిప్పను!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రమేష్ జారకిహోళి రాసలీలల కేసు మరో మలుపు తిరిగింది. రమేష్ జారకిహోళి తన మీద అత్యాచారం చేశాడని ఇప్పటికే కేసు పెట్టిన పీజీ లేడీ రెండు రోజుల క్రితం ఆమె మాట మార్చిందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే సీడీ లేడీ మరో కొత్త వీడియో విడుదల చెయ్యడంతో కలకలం రేపింది. నేను ఆ రోజు ఏమి చెప్పానో ఈ రోజు అదే చెబుతున్నాను. నేను మాట తప్పను, మడమ తిప్పను, నేను మా అమ్మా నాన్నతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకున్నాను. నా మాటకు నేను కట్టుబడి ఉన్నానని వీడియో విడుదల చెయ్యడంతో మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, ఆయన వర్గీయులు ఉలిక్కిపడ్డారని తెలిసింది.
Illegal affair: భార్యకు ఎంత మంది ప్రియులంటే ?, భర్త ముందే, కన్న కొడుకు చేతిలో!
రేప్ కేసు పెట్టిన పీజీ లేడీ
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా దగ్గర చేసుకున్నాడని, తన మీద అత్యాచారం చేశాడని బెంగళూరు పీజీ సుందరి కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీద కేసు పెట్టిన విషయం తెలిసిందే. తన మీద అత్యాచారం చేసి తన జీవితం నాశనం చేసిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళిని అరెస్టు చెయ్యాలని ఇప్పటికే పీజీ లేడీ ఎస్ఐటీ అధికారులకు మనవి చేసింది.
రెండు రోజుల క్రితం?
రమేష్ జారకిహోళి మీద అత్యాచారం కేసు పెట్టిన పీజీ లేడీ యూటర్న్ తీసుకుందని, ఆమె మాట మార్చిందని రెండు రోజుల క్రితం కన్నడ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఎస్ఐటీ అధికారులకు ఇచ్చిన స్టేట్ మెంట్ కు విరుద్దంగా సీడీ లేడీ మాట్లాడిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కరోనా దెబ్బతో క్వారంటైన్
పీజీ లేడీ మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి కరోనా పాజిటివ్ దెబ్బతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. రమేష్ జారకిహోళికి వ్యాది నయం అయిన తరువాత ఆయన్ను విచారణ చెయ్యాలని, అంత వరకు వేచి చూడాలని ఎస్ఐటీ అధికారులు నిర్ణయించారని తెలిసింది.
యువతి ప్రత్యక్షం.... మరో వీడియో విడుదల
బెంగళూరులోని ఎస్ఐటీ కార్యాలయం ముందు సీడీ లేడీ ప్రత్యక్షం అయ్యింది. ఎస్ఐటీ అధికారుల ముందు హాజరైన తరువాత ఆమె మళ్లీ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయింది. అనంతరం సీడీ లేడీ 1. 20 నిమిషాల వీడియో విడుదల చేసింది. తనను ఎస్ఐటీ అధికారులు విచారణ చెయ్యలేదని, కొన్ని పత్రాలు అధికారులకు సమర్పించడానికి తాను ఎస్ఐటీ కార్యాలయానికి వెళ్లానని క్లారిటీ ఇచ్చింది.
మాట తప్పను మడమ తిప్పను
తాను తన తల్లిదండ్రులతో మాట్లాడిన మాట వాస్తవమే అని సీడీ లేడీ స్పష్టం చేసింది. తనకు నచ్చచెప్పడానికి తన తల్లిదండ్రులు ప్రయత్నించినా సరే నేను జరిగింది జరిగిన్లు చెబుతానని, ఇంతకు ముందు నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటానని, నేను మాట మార్చలేదని, యూటర్న్ తీసుకోలేని సీడీ లేడీ స్పష్టం చేశారు.
చాలా దూరం వెళ్లింది
మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల కేసు విచారణ చేస్తున్న ఎస్ఐటీ అధికారులు సీడీ లేడీ తల్లిదండ్రులు, ఆకాష్ అనే యువకుడికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇదే సమయంలో సీడీ లేడీ ఆమె తల్లిదండ్రులతో మాట్లాడటం, తరువాత ఎస్ఐటీ అధికారుల ముందు హాజరుకావడంతో కథ రసవత్తరంగా మారింది. సీడీ లేడీ కేసు విషయంలో యూటర్న్ తీసుకున్నారని కన్నడ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
Recommended Video
మాజీ మంత్రికి అరెస్టు భయం?
నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని, మాజీ మంత్రి రమేష్ జారీకి హోళి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోనని, ఎస్ఐటీ అధికారులు ఆయన్ను విచారణ చెయ్యాలని సీడీ లేడీ మరో వీడియో విడుదల చెయ్యడం కలకలం రేపింది. సీడీ లేడీ కొత్త వీడియో దెబ్బతో రమేష్ జారకిహోళికి ఎస్ఐటీ అధికారుల అరెస్టు భయం పట్టుకునిందని కొన్ని కన్నడ మీడియా చానల్స్ లో వార్తలు ప్రసారం అవుతున్నాయి.