కలుషిత నీరు తాగి కాలనీ ప్రజల ప్రాణాలు పోయాయి, సీఎం సీరియస్, ఏం జరిగింది!
బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణంలోని కవాడిగర్హట్టిలో కలుషిత నీరు తాగి 70 మందికి పైగా అస్వస్థతకు గురై మహిళతో సహా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం నుంచి సమాచారం అందుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తునకు ఆదేశింశారు. అర్బన్ డెవలప్మెంట్ సెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
మూడు రోజుల్లోగా స్థల పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని బృందానికి సీఎం సిద్దరామయ్య సూచించారు. కర్ణాటక అర్బన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, రూరల్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు పలువురు విచారణ బృందంలో ఉన్నారు. ఈ ఘటనపై అత్యవసర విచారణ జరిపి నివేదికను అందజేయాని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు.

దీని ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. కవాడిగర్హట్టిలో కలుషిత నీరు తాగి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందజేస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారని సంబంధిత అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన వారికి తగిన వైద్యం అందిస్తామని చిత్రదుర్గ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి డి.సుధాకర్ తెలిపారు.
చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన మంత్రి డి. సుధాకర్ కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి డి. సుధాకర్ మాట్లాడుతూ కవాడిగర్హట్టిలో కొంత మంది అస్వస్థతకు గురై అర్ధరాత్రి నుంచి ఆస్పత్రిలో చేరారని తెలిపారు. గ్రామంలో తెల్లవారుజామున నుంచే పలువురికి అనారోగ్య సమస్యలు వచ్చాయని మంత్రి డి. సుధాకర్ తెలిపారు.
22 ఏళ్ల యువతి కూడా మృతి చెందిందని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించామని, పూర్తి సమాచారం రాగానే ప్రభుత్వ స్థాయిలో చర్చించి మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం అందజేస్తామని మంత్రి డి. సుధాకర్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం ఘటనకు గల కారణాలు, వాస్తవాలు తెలుస్తాయని మంత్రి డి. సుధాకర్ చెప్పారు.
అంతకు ముందు జిల్లా ఆసుపత్రిలోని బాలల విభాగం, యూరాలజీ, అత్యవసర విభాగాన్ని సందర్శించి వారి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. రోగి ఆరోగ్యం మెరుగుపడే వరకు చికిత్స కొనసాగించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్యా ప్రభు, పోలీస్ సూపరింటెండెంట్ కె.పరుశురామ్, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా అధికారి డాక్టర్ ఆర్. రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications