ఘోర ప్రమాదం: నడిసముద్రంలో బోల్తా కొట్టిన మర పడవ: మత్స్యకారులు గల్లంతు: ముమ్మరంగా గాలింపు
మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు తీరంలో ఘోర ప్రమాదం సంభవించింది. చేపట వేటకు వినియోగించే ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. నడి సముద్రంలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పలువురు జాలర్లు గల్లంతయ్యారు. మరికొందరిని తీర ప్రాంత రక్షక బలగాలు రక్షించాయి. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఫిషింగ్ బోటు బోల్తా కొట్టడానికి భారీ అలలు, బలమైన ఈదురు గాలులు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది.
మంగళూరు తీరం సమీపంలోని హణంబూరు ప్రాంతం నుంచి శ్రీరక్షా అనే మరపడవలో 22 మత్స్యకారులు చేపలవేటకు బయలుదేరారు. కొన్ని నాటికన్ మైళ్ల దూరం వెళ్లిన తరువాత.. ఆ పడవ ప్రమాదానికి గురైంది. బోల్తా కొట్టింది. సామర్థ్యానికి మించి మత్స్యకారులు అందులో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే తీర ప్రాంత రక్షక బలగాలు రంగంలో దిగాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాయి.

16 మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. మరో ఆరుమంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. పడవ ప్రమాదానికి గురైన సమయంలో భారీగా ఈదురుగాలులు వీచాయని, కెరటాలు ఎగిసిపడ్డాయని ప్రాణాలతో బయటపడిన మత్స్యకారులు తెలిపారు. నీరు కడుపులోకి వెళ్లడం వల్ల వాంతులు చేసుకుంటూ అనారోగ్యానికి గురైన కొందరు మత్స్యకారులను ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
గల్లంతైన ఆరు మంది మత్స్యకారులను కాపాడటానికిక శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు. తుఫాన్ తరహా పరిస్థితులు ఏర్పడినందున.. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. మంగళూరు తీరానికి తుఫాన్ ప్రభావం లేకపోవడం వల్లే మత్స్యకారులు చేపలవేటకు బయలుదేరి ఉంటారని భావిస్తున్నట్లు స్థానిక అధికారులు చెప్పారు. తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలు, కేరళకు తుఫాన్ ప్రభావం ఉందని, కర్ణాటక దాని తీవ్రత ఉండదని భావించినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.
Recommended Video
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications