Khiladi: ప్రియుడితో రొమాన్స్, ఆంటీ భర్త ఏం చేశాడంటే, అంత్యక్రియల టైమ్ లో ట్విస్ట్!
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టి పెద్దవాళ్లు అవుతున్న సమయంలో పక్కఊరిలో నివాసం ఉంటున్న ఓ యువకుడు ఆంటీకి పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత ఆ యువకుడు ఇంటికి వచ్చి వెళ్లడం మొదలుపెట్టాడు. ఇదే సందర్బంలో తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుంది. వ్యవసాయం చేయిస్తున్న భర్తకు అతని భార్య మ్యాటర్ కొంతకాలం తెలీదు.
మొదట సీక్రేట్ గా సాగిపోయిన ఆంటీ అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. భార్య, ఆమె ప్రియుడికి భర్త బుద్దిమాటలు చెప్పాడు. భర్త బుద్దిమాటలు చెప్పినా, బంధువులు మందలించినా ఆంటీ మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఇదే సమయంలో పొలంలోని చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో భర్త శవమై కనిపించాడు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్న బంధువులు, గ్రామస్తులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వేరే ఊరిలో ఉంటున్న రైతు తమ్ముడు ఎంట్రీతో అన్నదాత ఆత్మహత్య కేసు సీన్ మొత్తం మారిపోయింది.
Lovers: రెండు నెలల క్రితం పెళ్లి, ఇంట్లో ఏకాంతంగా ఉంటే ఇద్దరిని నరికి చంపిన అమ్మాయి తండ్రి, దెబ్బకు!
భార్య, పిల్లలతో రైతు హ్యాపీలైఫ్
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని బేలూరు గ్రామంలో ధనగుండయ్య అలియాస్ ధను అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 17 సంవత్సరాల క్రితం ధను సిద్దమ్మ అలియాస్ సిద్దేశ్వరి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ధను, సిద్దేశ్వరి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ధను, సిద్దేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పిల్లలు పెద్దవాళ్లు అయ్యే సమయంలో?
భార్య సిద్దేశ్వరి, ఇద్దరు పిల్లలతో కలిసి ధను ఐదు పంవత్సరాల క్రితం వరకు చాలా సంతోషంగా ఉండేవాడు. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్న సమయంలో పక్కఊరిలో నివాసం ఉంటున్న వీరయ్య అనే యువకుడు సిద్దేశ్వరి ఆంటీకి పరిచయం అయ్యాడు. తరువాత సిద్దేశ్వరి ఆమెకు పరిచయం అయిన వీరయ్యను ఆమె భర్త ధనుకు పరిచయం చేసింది. కొంతకాలం పాటు వీరయ్య సిద్దేశ్వరి ఇంటికి వచ్చి వెలుతూ వాళ్లకు దగ్గర అయ్యాడు.
ప్రియుడితో రొమాన్స్
నాలుగు పంవత్సరాల క్రితం వరకు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెలుతున్న వీరయ్య తరువాత సిద్దేశ్వరి ఇంట్లో గంటలు గంటలు ఉండటం మొదలుపెట్టాడు. ఇదే సందర్బంలో తనకంటే వయసులో చిన్నవాడైన వీరయ్యతో సిద్దేశ్వరి ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుంది. వ్యవసాయం చేయిస్తున్న భర్త ధను ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం దగ్గర ఉండటంతో సిద్దేశ్వరి ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది.
భార్యకు వార్నింగ్ ఇచ్చినా మాటవినలేదు
సంవత్సరం పాటు సిద్దేశ్వరి అక్రమ సంబంధం మ్యాటర్ ఆమె భర్త ధనుకు తెలీదు. మొదట సీక్రేట్ గా సాగిపోయిన సిద్దేశ్వరి ఆంటీ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త ధనుకు తెలిసిపోయింది. భార్య సిద్దేశ్వరి, ఆమె ప్రియుడు వీరయ్యకు ధను బుద్దిమాటలు చెప్పాడు. భర్త ధను బుద్దిమాటలు చెప్పినా, బంధువులు మందలించినా సిద్దేశ్వరి మాత్రం పద్దతి మార్చుకోలేదు.
ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు
ఉదయం ధను అతని పొలంలోని చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించాడు. అప్పుల బాధతో ధను రాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్న బంధువులు, గ్రామస్తులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ధను అంత్యక్రియలకు వేరే ఊరిలో ఉన్న బంధువులు హాజరైనారు. కోప్పళలో ఉంటున్న ధను తమ్ముడు సొంత గ్రామానికి రావడంతో ధను ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్టు ఎదురైయ్యింది.
చచ్చిపో అని బూతులు మాట్లాడిన భార్య
రాత్రి సిద్దేశ్వరి ఇంటికి వెళ్లిన వీరయ్య ఆమెతో రొమాన్స్ చేస్తున్న సమయంలో ధను ఇంట్లోకి వెళ్లాడు. ఆ సందర్బంలో సిద్దేశ్వరి, ధను దంపతుల మద్య పెద్ద గొడవ జరిగిందని తెలిసింది. నేను నా ప్రియుడు వీరయ్యతో కలిసి జీవిస్తానని, నువ్వు ఉరి వేసుకుని చస్తే పీడపోతుందని సిద్దేశ్వరి బూతులు తిట్టిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
భార్య, ప్రియుడు అరెస్టు
భార్య సిద్దేశ్వరి, ఆమె ప్రియుడు వీరయ్య దాడి చేసి బూతులు తిట్టడంతో ఆవేదనతో ధను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త ధను ఆత్మహత్యకు కారణ: అయిన సిద్దేశ్వరి, ఆమె ప్రియుడు వీరయ్యను పోలీసులు అరెస్టు చేశారు. భార్య, ఆమె ప్రియుడు దాడి చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వలనే ధను ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటంతో అతని బంధువులు షాక్ అయ్యారు.