Wife: భార్తకు బాయ్ చెప్పింది. ప్రియుడితో హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేసింది, క్లైమాక్స్ లో ఏం చేసింది?
బెంగళూరు/శివమొగ్గ: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అని దంపతులు పోట్లాడుకున్నారు. భార్య తీరుతో విసిగిపోయిన భర్త అతని భార్యను వదిలేసి దూరంగా ఉంటున్నాడు.
Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే?
భర్తకు దూరంగా ఉంటున్న భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని హత్య కేసులో అడ్డంగా బుక్కైపోయింది. కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చెన్నపట్టణలో ఆయేా బేగం అలియాస్ ఆయేషా అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఆయేషా ఆమె భర్తతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసింది.
కొంతకాలం తరువాత ఆయేషా రూట్ మార్చింది. హాసన్ జిల్లాలోని చెన్నరాయణపట్టణలో నివాసం ఉంటున్న జావద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆయేషా అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. మొగుడు ఇంట్లో ఉన్నా సరే ఆయేషా మాత్రం బయటకు వెళ్లి ప్రియుడిు జావద్ తో ఎంజాయ్ చేసింది. విషయం తెలుసుకున్న భర్త అతని భార్య ఆయేషాను వదిలేసి అతను వేరుగా నివాసం ఉంటున్నాడు.
ప్రియుడు జావద్ తో కలిసి ఆయేషా శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలుకాలోని హెరిటేజ్ లాడ్జ్ లోకి వెళ్లి రూమ్ తీసుకున్నారు. రెండు రోజుల నుంచి ఆయేషా ఆమె ప్రియడు జావద్ తో ఎంజాయ్ చేస్తోంది. రెండు రోజుల తరువాత రాత్రి ఆయేషా, జావెద్ ల మధ్య గొడవలు జరిగాయి. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన ఆయేషా కత్తి తీసుకుని ఆమె ప్రియుడు జావెద్ గొంతు కోసి దారుణంగా హత్య చేసింది.
ప్రియుడు జావద్ ను హత్య చేసిన తరువాత ఆయేషా హోటల్ రూమ్ లో నుంచి బయటకు వచ్చింది, రూమ్ బయట తాళం వేసిన ఆయేషా అక్కడి నుంచి పరారైయ్యింది, మరుసటి రోజు జావద్ హత్యకు గురైన విషయం గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్ లో ప్రియుడు జావద్ ను హత్య చేసిన ఆయేషా నేరుగా హాసన్ చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయింది. కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.