బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sankranthi: సంక్రాంతి ఎద్దుల పోటీలు, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, యువకుల ప్రాణాలతో ?, ఏం జరిగింది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమొగ్గ: సంక్రాంతి పండుగ సందర్బంగా ఎద్దుల బెదిరింపు సమయంలో తీవ్రగాయాలైన ఇద్దరు మరణించారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని కొనెగవల్లి గ్రామం, సొరబ తాలూకాలోని మల్లూరు గ్రామంలో చోటుచేసుకున్నాయి.మకర సంక్రాంతి పండుగలో భాగంగా శివమొగ్గ తాలూకా కొనెగవల్లి గ్రామంలో, సొరబ తాలూకా మల్లూరు గ్రామంలో ఎద్దుల పండుగ నిర్వహించారు.

Wife: రెండో భార్యతో రొమాన్స్, అర్దరాత్రి మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా?Wife: రెండో భార్యతో రొమాన్స్, అర్దరాత్రి మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా?

కొనగవల్లిలో జరుగుతున్న ఎద్దుల కొట్లాట పోటీని చూసేందుకు వెళ్లిన ఎద్దులు కొమ్ములతో దాడి చెయ్యడంతో శివమొగ్గలోని అల్కోలా ప్రాంతంలో నివాసం ఉంటున్న లోకేష్ (32) అనే యువకుడు మృతి చెందాడని అధికారులు తెలిపారు. అదే సమయంలో 6 మందికి గాయాలు కావడంతో శివమొగ్గలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎద్దులను బెదిరించడంలో గాయపడిన లోకేష్‌ను శివమొగ్గలోని మెగాన్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక సోమవారం మృతి చెందాడని పోలీసులు అన్నారు.

Sankranthi: On the occasion of Sankranthi, two youths lost their lives in bull competitions and bull goring in Karnataka.

సొరబ తాలూకా అనవట్టి మల్లూరులోని హోరీ బహబ్బలో నివాసం ఉంటున్న రంగనాథ్ (24 అనే యువకుడు చికిత్స విఫలమై శివమొగ్గలోని మెగాన్ ఆసుపత్రిలో మరణించాడు. ఎద్దులు పొవడంతో మొదట రంగనాథ్ ను షికారిపురలో ఆస్పత్రిలో చేర్చించారు. తరువాత అక్కడ రంగనాథ్ కు కడుపులో కుట్లు వేసిన అనంతరం శివమొగ్గలోని మెగాన్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స ఫలించక సోమవారం రంగనాథ్ ఆస్పత్రిలో మృతి చెందాడని అధికారులు తెలిపారు. ఎద్దుల బెదిరింపులు, ఎద్దుల పోటీల్లో యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు ఎద్దుల పోటీల నిర్వహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

Girl: అమ్మాయిని కిడ్నాప్ చేసి ?, క్లైమాక్స్ లో ఎన్ కౌంటర్ జస్ట్ మిస్, బుల్లెట్ రుచితో కుయ్యో!Girl: అమ్మాయిని కిడ్నాప్ చేసి ?, క్లైమాక్స్ లో ఎన్ కౌంటర్ జస్ట్ మిస్, బుల్లెట్ రుచితో కుయ్యో!

శివమొగ్గ జిల్లాలోని కొనెగవల్లి, మల్లూరు గ్రామాల్లో ఎద్దుల బెదిరింపుల పండుగ, ఎద్దుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులపై కేసు నమోదు అయ్యింది. ఎద్దులను పట్టుకునే పోటీలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్వహకులు ఎద్దుల పోటీలు, ఎద్దుల బెదిరింపుల కార్యక్రమాలు ప్లాన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

బుల్ క్యాచింగ్ పోటీలను అభిమానులను దూరం నుంచి చూసేందుకు అనుమతించాలి. దీంతోపాటు బుల్ రన్ ప్రాంతంలో బారికేడ్ ఏర్పాటు చేయాలి. ఈ భద్రతలను ఎద్దుల పోటీల నిర్వాహకులు పాటించలేదని ఫిర్యాదులు అందాయని, విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Sankranthi: On the occasion of Sankranthi, two youths lost their lives in bull competitions and bull goring in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X