ఇంటి దొంగలు ఏటీఎంలో రూ. 24 లక్షలు లూటీ చేశారు. మాస్టర్ మైండ్ ఎవరంటే!
బెంగళూరు: బ్యాంకు ఏటీఎం సేఫ్టీడోర్ పగలగొట్టి రూ.24.17 లక్షలు దోచుకున్న కేసులో ఏటీఎం మెషిన్ నింపుతున్న కస్టోడియన్తో సహా నలుగురు నిందితులను బెంగళూరు సిటీలోని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల స్కెచ్ ల గురించి తెలుసుకున్న బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసులు షాక్ అయ్యారు.
బెంగళూరులోని బీటీఎం లేఅవుట్లో నివాసం ఉంటున్న నదీమ్, హుస్కూర్కు చెందిన శ్రీరామ్, దొడ్డనాగమంగళకు చెందిన అరుల్ కుమార్, మారతహళ్లికి చెందిన మహేష్ లను అరెస్టు చేశారు. జూన్ 5న పరప్పన అగ్రహారలోని కేఆర్ నగర్ రోడ్డులో ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం సెంటర్ వద్ద నిందితులు ఏటీఎం మిషన్ తలుపులు తెరిచి రూ. 24.17 లక్షలు దోచుకుని పరారయ్యారు.

కుడ్లుగేట్ సీఎంఎస్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ వైఎస్ సిద్దరాజు ఏటీఎం మెషీన్ లో చోరీ అయిన విషయం గుర్తించి ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితులు ఏటీఎం యంత్రంలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన నిందితుడు నదీమ్, నిందితుడు శ్రీరామ్ ద్వారా సీఎంఎస్ కంపెనీ కస్టోడియన్ అరుల్ కుమార్ను సంప్రదించి చోరీకి పథకం వేశారు.
సీఎంఎస్ కంపెనీ వాహన డ్రైవర్ ఆర్ముగం, సెక్యూరిటీ గార్డు పరమేశ్వరప్ప, కస్టోడియన్ అరుల్ కుమార్, మహదేవ బృందం జూన్ 5వ తేదీన ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం మిషన్లో రూ. 32 లక్షల నగదును నింపారు. కస్టోడియన్ అరుల్ కుమార్ ముందస్తు ప్లాన్ ప్రకారం ఏటీఎం మిషన్ సేఫ్ డోర్ కు సరిగ్గా తాళం వేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఏటీఎం మెషిన్ నింపిన కొద్ది నిమిషాల్లోనే నిందితులు నదీమ్, మహేశ్ హెల్మెట్ ధరించి ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి సేఫ్ డోర్ తెరిచి బ్యాగ్లో డబ్బులు నింపి పరారయ్యారు. జూన్ 6వ తేదీ ఉదయం ఏటీఎం మెషీన్లో నగదు నింపేందుకు వెళ్లిన సిబ్బంది సేఫ్టీ డోర్ తెరిచి ఉండటంతో ఏటీఎంలో నగదు చోరీ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏటీఎం సెంటర్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలు, మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications