బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: అందమైన భార్య మీద గంటగంటకు భర్తకు అనుమానం, భార్యతో పాటు కూతుర్ని చంపేసిన శాడిస్టు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బళ్లారి: కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా ఉంటున్నది. దంపతులకు ఓ కుమార్తె ఉంది. భర్త పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం పూనీపూరీ అంగడి పెడుతున్న భర్తకు అతని భార్య సహాయం చెయ్యడానికి వెలుతోంది. పానీపూరీ తినడానికి వచ్చి వెలుతున్న యువకులు, పురుషులు ఆమె తో మాట్లాడుతున్నారు. అందంగా ఉన్న తన భార్యకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని, ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారని భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. రానురాను గంటగంటకు భార్య మీద నిఘా వెయ్యడం మొదలు పెట్టాడు. అయితే భర్త అనుమానం మాత్రం ఇంకా పెరిగింది. ఇకలాభం లేదని భర్త ఆ ఊరుమార్చేసి భార్య పుట్టింటి దగ్గరకు వెళ్లిపోయి అక్కడ పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి వ్యాపారం ముగించుకుని పీకలదాక మద్యం సేవించిన భర్త ఇంటికి వెళ్లాడు. నిద్రపోతున్న భార్య, కూతురిని దారుణంగా ఇనుపరాడ్ తో కొట్టి కత్తితో పొడిచి చంపేసిన భర్త తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం వలనే ఆమెను, కూతురిని చంపేశానని భర్త అంగీకరించాడని పోలీసులు అంటున్నారు.

Illegal affair: ప్రియుడిని తమ్ముడిగా పరిచయం చేసిన భార్య, ఐదు మందితో లేడీ, ఇద్దరూ ఫినిష్ !Illegal affair: ప్రియుడిని తమ్ముడిగా పరిచయం చేసిన భార్య, ఐదు మందితో లేడీ, ఇద్దరూ ఫినిష్ !

పానీపూరీ వ్యాపారం

పానీపూరీ వ్యాపారం

కర్ణాటకలోని కలబురిగిలో దిగంబర హనుమంతప్ప (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 13 సంవత్సరాల క్రితం జగదీశ్వరి (37) అనే వివాహం చేసుకున్న హనుమంతప్ప అతని భర్తతో సంతోషంగా ఉండేవాడు. కలబురిగిలోని రామమందిరం సమీపంలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. హనుమంతప్ప, జగదీశ్వరి దంపతులకు ప్రియాంక (11) అనే కుమార్తె ఉంది. జగదీశ్వరి భర్త హనుమంతప్ప పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడు.

 భర్తకు సహాయం చెయ్యడాకి వెలుతున్న భార్య

భర్తకు సహాయం చెయ్యడాకి వెలుతున్న భార్య

ప్రతిరోజూ సాయంత్రం పూనీపూరీ అంగడి పెడుతున్న భర్త హనుమంతప్పకు అతని భార్య జగదీశ్వరి సహాయం చెయ్యడానికి వెలుతోంది. పానీపూరీ తినడానికి వచ్చి వెలుతున్న యువకులు, పురుషులు జగదీశ్వరితో చనువుగా మాట్లాడుతున్నారని హనుమంతప్ప గుర్తించాడు. పానీపూరీ తినడానికి వచ్చేవారితో నువ్వు మాట్లాడకూడదని కొంతకాలం హనుమంతప్ప అతని భార్య జగదీశ్వరికి చెప్పాడు.

అందంగా ఉన్న భార్యకు ఫ్యాన్స్ ఎక్కువని భర్తకు డౌట్

అందంగా ఉన్న భార్యకు ఫ్యాన్స్ ఎక్కువని భర్తకు డౌట్

అందంగా ఉన్న తన భార్య జగదీశ్వరికి ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారని, ఏదో జరుగుతోందని ఆమె భర్త హనుమంతప్పకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో హనుమంతప్ప, జగదీశ్వరి దంపతుల మద్య గొడవలు జరిగాయి. రానురాను గంటగంటకు భార్య జగదీశ్వరి మీద నిఘా వెయ్యడం మొదలు పెట్టాడు. అయితే భర్త హనుమంతప్ప అనుమానం మాత్రం ఇంకా పెరిగింది.

 కుర్రాల్లాతో నవ్వుతూ మాట్లాడుతున్న భార్య

కుర్రాల్లాతో నవ్వుతూ మాట్లాడుతున్న భార్య

కొన్ని నెలల క్రితం హనుమంతప్ప పని మీద బయటకు వెళ్లడంతో అతని భార్య జగదీశ్వరి పానీపూరీ వ్యాపారం చెయ్యడానికి వెళ్లింది. పానీపూరీ తినడానికి వెళ్లిన యువకులు అక్కడే కుర్చుని జగదీశ్వరికి జోకులు వేసి అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో వెళ్లిన హనుమంతప్ప ఎందుకు నా భార్యతో మీరు మాట్లాడుతున్నారు అంటూ గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దదికావడంతో స్థానికులు సర్దిచెప్పి ఆ యువకులను అక్కడి నుంచి పంపించేశారు.

భార్య దెబ్బతో ఊరు మార్చేసిన భర్త

భార్య దెబ్బతో ఊరు మార్చేసిన భర్త


భార్య జగదీశ్వరి మీద రోజురోజుకు అనుమానం ఎక్కువ కావడంతో ఇకలాభం లేదని, ఊరు మార్చేయాలని హనుమంతప్ప డిసైడ్ అయ్యాడు. కలబురిగి జిల్లాలోని సేడంలో జగదీశ్వరి పుట్టింటి వాళ్లు నివాసం ఉంటున్నారు. జగదీశ్వరి సోదరులు సేడంలో అద్దె ఇల్లు తీసిచ్చి పానీపూరీ వ్యాపారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు నెలల క్రితం హనుమంతప్ప అతని భార్య, కుమార్తెతో కలిసి కలబురిగిలో ఇల్లు ఖాళీ చేసి సేడం చేరుకున్నాడు.

 అర్దరాత్రి పీకలదాక మద్యం తాగి వెళ్లిన భర్త

అర్దరాత్రి పీకలదాక మద్యం తాగి వెళ్లిన భర్త


సేడంలో రెండు నెలల నుంచి హనుమంతప్ప పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడు. ఊరు మార్చిన భార్య జగదీశ్వరి ఇక్కడ కూడా అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త హనుమంతప్పకు అనుమానం పెరిగిపోయింది. రాత్రి వ్యాపారం ముగించుకుని పీకలదాక మద్యం సేవించిన భర్త ఇంటికి వెళ్లాడు. నిద్రపోతున్న భార్య జగదీశ్వరిని నిద్రలేపి మరీ గొడవ పెట్టుకున్నాడు.

భార్య, కూతురిని స్పాట్ లో చంపేసిన శాడిస్టు

భార్య, కూతురిని స్పాట్ లో చంపేసిన శాడిస్టు

తరువాత జగదీశ్వరి ఆమె కూతురితో కలిసి నిద్రపోయింది. అర్దరాత్రి దాటిన తరువాత భార్య జగదీశ్వరి,, కూతురు ప్రియాంక మీద ఇనుపరాడ్ తో దారుణంగా కొట్టి కత్తితో పొడిచి చంపేసిన హనుమంతప్ప తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య జగదీశ్వరి అక్రమ సంబంధం పెట్టుకోవడం వలనే ఆమెను, తన కూతురు ప్రియాంకను చంపేశానని హనుమంతప్ప అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. కూతురు జగదీశ్వరి, మనుమరాలు ప్రియాంక దారుణ హత్యకు గురి కావడంతో ఆమె తల్లి తారాబాయి ఆర్తనాదాలు చేసింది. జిల్లా ఎస్పీ డాక్టర్ సమి మరియమ్ జార్జ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

English summary
Wife: Husband kills wife and daughter in Kalaburagi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X