FY-26 మొదటి త్రైమాసికంలోనూ అదానీ పవర్ అదే దూకుడు..
అదానీ పవర్ లిమిటెడ్ (APL) 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. విద్యుత్ డిమాండ్లో హెచ్చు తగ్గులున్నా, కంపెనీ స్థిరమైన పనితీరును ప్రదర్శించింది. వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా అదానీ పవర్ లిమిటెడ్ సామర్థ్యాన్ని, కార్యకలాపాల సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటోంది. జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసిక ఫలితాలపై అదానీ పవర్ లిమిటెడ్ సీఈఓ ఎస్ బి కయాలియా ప్రసంగించారు. "విద్యుత్ డిమాండ్ లో వైవిధ్యం, ఊహించని వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ త్రైమాసికంలో అదానీ పవర్ స్థిరమైన ఆర్థిక పనితీరు దాని స్థితిస్థాపకతకు, బలమైన పునాదికి నిదర్శనం" అని అన్నారు. 2030 నాటికి 30 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో, వేగవంతమైన ప్రాజెక్ట్ అమలు, వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా తమ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నామని కయాలియా తెలిపారు.
"ముందుగానే అల్ట్రా- సూపర్ క్రిటికల్ బాయిలర్లు, టర్బైన్ లు, జనరేటర్.. తదితర ముఖ్యమైన పరికరాలను పొంది, మా పోటీతత్వాన్ని బలోపేతం చేస్తూ, భారతదేశ ఇంధన అవసరాలకు మద్దతునిస్తున్నాం. విశ్వసనీయమైన.. అందుబాటు ధరల్లో విద్యుత్ ను అందిస్తూ, దేశ ప్రగతిలో మా వంతు కృషి చేస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.
కంపెనీ స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరిగింది. Q1 FY25లో 15,250 మెగావాట్లు ఉన్న సామర్థ్యం, Q1 FY26 నాటికి 17,550 మెగా వాట్లకు చేరింది. దీనికి 1,200 మెగావాట్ల మోక్సీ పవర్ జనరేషన్ లిమిటెడ్, 600 మెగావాట్ల కోర్బా పవర్ లిమిటెడ్, 500 మెగావాట్ల అదానీ దహను థర్మల్ పవర్ స్టేషన్ల కొనుగోళ్లు కారణం. జూలై 2025లో 600 మెగావాట్ల విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ కొనుగోలు పూర్తవడంతో, మొత్తం స్థాపిత సామర్థ్యం 18,150 మెగావాట్లకు చేరింది.
Q1 FY26లో ముందస్తు రుతుపవనాల కారణంగా విద్యుత్ డిమాండ్ తగ్గింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో తీవ్రమైన వడగాల్పుల కారణంగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా, Q1 FY25లోని 452.4 బిలియన్ యూనిట్ల (BU)తో పోలిస్తే, Q1 FY26లో ఇంధన డిమాండ్ 1.6 శాతం తగ్గి 445.2 బిలియన్ యూనిట్లకు చేరింది. గరిష్ట డిమాండ్ కూడా 2.8శాతం తగ్గి 250 గిగావాట్ల నుండి 243 గిగావాట్లకు పడిపోయింది. ఇది వాణిజ్య డిమాండ్, టారిఫ్ లపై ప్రభావం చూపింది.
డిమాండ్, వాతావరణ పరిస్థితుల్లోని హెచ్చుతగ్గుల కారణంగా, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్లో సగటు మార్కెట్ క్లియరింగ్ ధర గత సంవత్సరంతో పోలిస్తే 16శాతం క్షీణించి, Q1 FY26లో యూనిట్ కు రూ. 4.41కి చేరింది. ఇదే సమయంలో డే ఎహెడ్ మార్కెట్ వాల్యూమ్స్ కూడా 7 శాతం తగ్గి 12,399 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. ఇంధన డిమాండ్ మందగించినప్పటికీ, APL తన నిర్వహణా సామర్థ్యాన్ని పెంచుకోవడం, కొన్ని ప్లాంట్ల నుండి అధిక విద్యుత్ కొనుగోళ్ల కారణంగా విద్యుత్ అమ్మకాల్లో 1.6శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది.
Q1 FY26లో వ్యాపార అమ్మకాలు Q1 FY25లో 5.3 BUతో పోలిస్తే 7.7 శాతం పెరిగి 5.7 BUకి చేరాయి. గొడ్డా పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ నుండి సక్రమంగా చెల్లింపులు అందుకోవడం ప్రారంభించింది, జూన్ '25లో USD 437 మిలియన్లు మరియు జూలై '25లో USD 75 మిలియన్లు విడుదలయ్యాయి. అహ్మదాబాద్ బెంచ్ గౌరవనీయ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా ఆమల్గమేషన్ పథకానికి ఆమోదం పొందిన తర్వాత, అదానీ పవర్ (జార్ఖండ్) లిమిటెడ్ దాని హోల్డింగ్ కంపెనీ అయిన APLతో 1 ఏప్రిల్ 2024 న విలీనమైంది. దీని ఫలితంగా.. గొడ్డా ప్లాంట్ 1,600 MW విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం APL స్టాండ్ అలోన్ సంస్థలో భాగమవుతుంది. విలీనం తర్వాత గొడ్డా పవర్ ప్లాంట్ క్రెడిట్ రేటింగ్ BBB స్టేబుల్ నుండి AA స్టేబుల్ గా అప్ గ్రేడ్ చేయబడింది. దీనివల్ల దాని ఆర్థిక వ్యయం తగ్గుతుంది.

ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ ను ముంబై బెంచ్ NCLT నుండి ఆమోదం పొందిన తర్వాత APL జూలై 7, 2025న కొనుగోలు చేసింది. VIPL మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలోని బుటిబోరిలో 2x300 MW (600 MW) థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్వహిస్తోంది. ఈ కొనుగోలు APL యొక్క ఆపరేటింగ్ సామర్థ్యాన్ని 18,150 MW కు పెంచుతుంది. మహారాష్ట్రలోని కీలక పారిశ్రామిక ప్రాంతంలో బలోపేతం అవుతుంది.
APL, ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న 2x800 MW (1,600 MW) అల్ట్రా-సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్ నుండి 25 సంవత్సరాల కాలానికి 1,500 MW (నికర) విద్యుత్ సరఫరా కోసం UP పవర్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒక PPAని సంతకం చేసింది. దీనితో, APL ఇప్పుడు 4,520 MW సామర్థ్యానికి అదనపు PPA ఒప్పందాలను కలిగి ఉంది. ఇది దాని రాబోయే 12,520 MW విస్తరణ ప్రాజెక్టుల నుండి సరఫరా అవుతుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications