ఆశలన్నీ నిర్మలమ్మపైనే.. రూ. 10 లక్షలలోపు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుందా?
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పన్ను విధానాల్లో మార్పులు, రిబేట్లు, తగ్గింపుల కోసం వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.7.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు 30% పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తారు.
ఈ నేపథ్యంలో 2025-26 కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను పరిధి నుంచి మినహాయించబడవచ్చు. అలాగే, రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబును ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.7.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. రూ.15 లక్షలకు పైబడిన ఆదాయం 30% పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తుంది. ఈ విధానాన్ని మరింత సరళతరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
2025-26 కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 25% కొత్త పన్ను శ్లాబ్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయ నష్టం వాటిల్లవచ్చు. దీనికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
2025-26 బడ్జెట్కు ముందు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) కొన్ని సిఫార్సులు చేసింది. వాటిలో ప్రధానంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పన్ను మినహాయింపు పరిమితిని రూ.5.7 లక్షలకు పెంచడం. పొదుపు వడ్డీపై రూ.10,000 తగ్గింపును రూ.19,450కి పెంచడం. బీమా ప్రీమియంలు, PF కంట్రిబ్యూషన్లపై రూ.1.5 లక్షల మినహాయింపును రూ.2.6 లక్షలకు పెంచడం.
ద్రవ్యోల్బణం కారణంగా పన్ను చెల్లింపుదారులకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి పన్ను శ్లాబులు, మినహాయింపులను సవరించాలని GTRI సూచించింది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గత సంవత్సరంలా కాకుండా ఈసారి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు ఉండకపోవచ్చు. ఆర్థిక వృద్ధిని పెంచడానికి ప్రభుత్వం కొన్ని పన్ను చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, బడ్జెట్ వృద్ధి లేదా ఆదాయాల పునరుద్ధరణపై పరిమిత ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పన్ను భారం తగ్గించే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ మార్పులు బడ్జెట్ ఆమోదంపై ఆధారపడి ఉంటాయి.












Click it and Unblock the Notifications