సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్.. ఆసియా మార్కెట్లు కళకళ!
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన "రీసిప్రోకల్ టారిఫ్ల"ను తాత్కాలికంగా నిలిపివేయడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. పెట్టుబడిదారులు గత కొన్ని రోజులుగా భయాందోళనలతో ఎదురుచూస్తున్న సమయానికి తెరపడటంతో, మార్కెట్లలో పండుగ వాతావరణం నెలకొంది.
వెనక్కి తగ్గిన ట్రంప్
ట్రంప్ ప్రభుత్వం విదేశీ వస్తువులపై విధించిన రీసిప్రోకల్ టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే, చైనాపై టారిఫ్లను మాత్రం 125%కి పెంచింది. ఇది ట్రంప్ టారిఫ్ విధానంలో సడలింపు వచ్చినప్పటికీ, చైనాపై మాత్రం ఒత్తిడి కొనసాగిస్తుంది. ఇటీవల ట్రంప్ తీసుకున్న వాణిజ్య విధాన మార్పుల కారణంగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయి. బిలియనీర్ ఇన్వెస్టర్లు ట్రంప్ విధించిన టారిఫ్లను తీవ్రంగా విమర్శించారు. పలు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు అమెరికాలో మాంద్యం వస్తుందని హెచ్చరించారు. స్ట్రాటజిస్ట్లు స్టాక్ మార్కెట్ లాభాల అంచనాలను తగ్గించారు. ట్రంప్ ప్రపంచ వాణిజ్యాన్ని మళ్లీ తీర్చిదిద్దాలన్న యత్నంలో పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని కలిగించాడు.

మార్కెట్లో కొత్త ఆశలు
తాజాగా విదేశీ వస్తువులపై విధించిన రీసిప్రోకల్ టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లో కొత్త ఆశలు చిగురించాయి. ట్రంప్ నిర్ణయం వెలువడగానే, ఆసియా మార్కెట్లలో ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు పెరిగింది. జపాన్ నిక్కీ 225 ప్రారంభ ట్రేడింగ్లో ఒక్కసారిగా దూసుకుపోయింది. ఉదయం ట్రేడింగ్లో ఏకంగా 8.3 శాతం ఎగిసింది. ఆస్ట్రేలియాలో ASX 200 ఆరు శాతానికి పైగా దూసుకుపోయింది. సురక్షిత పెట్టుబడిగా భావించే జపనీస్ యెన్, డాలర్తో పోలిస్తే 0.64 శాతం పెరిగి 146.83 యెన్లకు చేరుకుంది. బంగారం ధర కూడా 0.5 శాతం పెరిగి ఔన్సుకు 3,097 డాలర్లకు చేరింది. ఇది, సంక్షోభ సమయాల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు..
ఆసియా మార్కెట్లు కళకళ..
ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్ కూడా ఉదయం ట్రేడింగ్లో 6% పైగా పెరిగింది. S&P/ASX 200 సూచిక 0010 GMT సమయానికి 6.3% పెరిగి 7,842.90 పాయింట్లకు చేరుకుంది. బుధవారం ఈ సూచిక 1.8% పడిపోయింది. అంటే, ఒక్క రోజులోనే మార్కెట్ తన మునుపటి నష్టాలన్నింటినీ దాదాపుగా పూడ్చుకుంది. ట్రంప్ తన సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని పెట్టుబడిదారులు స్వాగతించడంతో మార్కెట్ ఒక్కసారిగా కళకళలాడింది.
న్యూజిలాండ్ బెంచ్మార్క్ S&P/NZX 50 సూచిక 3.7% పెరిగి 12,237.61 పాయింట్లకు చేరుకుంది. ఈ లాభాలు నిలబడితే, మార్చి 2020 చివరి నుండి ఇదే అత్యుత్తమ రోజు అవుతుంది. మార్కెట్లలో ఇంతటి ఉత్సాహం చాలా కాలం తర్వాత కనిపించింది. అటు టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క నిక్కీ 225 ట్రేడింగ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే 7.4% పెరిగి 34,052.58 వద్ద ట్రేడ్ అయింది. ఇది పెట్టుబడిదారుల ఉత్సాహానికి అద్దం పడుతోంది. సియోల్లో కూడా కోస్పి సూచిక 5.4 శాతం పెరిగింది. మొత్తం మీద, ఆసియా మార్కెట్లలో గురువారం ఉదయం ట్రేడింగ్ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
భారత్ స్టాక్ మార్కెట్కు సెలవు
భారత స్టాక్ మార్కెట్లు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) ఏప్రిల్ 10 న శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మూసివేయబడతాయి. శుక్రవారం ట్రేడింగ్ జరుగుతుంది. ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయం, మార్కెట్లకు కొత్త ఊపిరినిచ్చింది. గత కొన్ని రోజులుగా భయాందోళనలతో ఉన్న పెట్టుబడిదారులు, ఒక్కసారిగా ఊరట చెందారు. మార్కెట్ నిపుణులు ఈ పరిణామాన్ని సానుకూలంగా అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం, ప్రపంచ వాణిజ్యానికి మేలు చేస్తుందని వారు భావిస్తున్నారు. అయితే, ఈ ఉత్సాహం ఎంతకాలం నిలబడుతుందో వేచి చూడాలి.
-
ఇరాన్ వార్ ఆపేద్దాం సార్..? ట్రంప్ కు సలహాదారుల షాక్.! -
యుద్ధానికి పుల్స్టాప్ పెట్టే దిశగా పుతిన్! ట్రంప్తో సీక్రెట్ ప్లాన్? -
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్పై ట్రంప్ సంచలన ప్రకటన! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications