జియోకు చుక్కలు చూపించేలా భారీ స్కెచ్! : BSNL - Vi దోస్తీ
దేశీయ టెలికాం రంగంలో త్వరలో ఒక సంచలనం నమోదు కాబోతోంది. మొబైల్ సిగ్నల్ దొరక్క, 5G సేవలు అందక ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు ఊరటనిచ్చేలా BSNL - వోడాఫోన్ ఐడియా (Vi) మధ్య మౌలిక వసతుల భాగస్వామ్యంపై చర్చలు మొదలయ్యాయి. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తృతిని పెంచడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు తమ టవర్లు, ఫైబర్ మరియు స్పెక్ట్రమ్ను పంచుకోవాలని యోచిస్తున్నాయి. ఈ విషయాన్ని టెలికాం శాఖ (DoT) పార్లమెంటరీ కమిటీకి ధృవీకరించింది.
ప్రస్తుతం మార్కెట్లో జియో, ఎయిర్టెల్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని తట్టుకోవడంలో BSNL, Vi కొంత వెనుకబడి ఉన్నాయి. BSNL ఇంకా 4G/5G విస్తరణలో వేగం పుంజుకోవాల్సి ఉండగా, వోడాఫోన్ ఐడియా భారీ బకాయిలు, నిధుల లేమితో సతమతమవుతోంది. ఒకరికి బలం ఉన్న చోట మరొకరికి నెట్వర్క్ లేకపోవడం ఇద్దరికీ మైనస్గా మారింది. అందుకే, ఒకరి టవర్లను మరొకరు వాడుకోవడం ద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని (Cost Cutting) నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వానిదే కీలక పాత్ర!
వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి ఇప్పటికే 49% వాటా ఉంది. అంటే పరోక్షంగా Vi కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థే. అందుకే ఈ రెండు కంపెనీల మధ్య సమన్వయం కుదిరితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. "వనరులను వృధా చేయకుండా, ఉన్న మౌలిక సదుపాయాలను ఇద్దరూ వాడుకుంటే 5G విస్తరణ వేగవంతం అవుతుంది" అని కమిటీ స్పష్టం చేస్తూ, దీనిపై ఆరు నెలల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని టెలికాం శాఖను ఆదేశించింది.
సాంకేతిక ప్రయోజనాలు ఏమిటి?
నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ ఒప్పందం కుదిరితే:
- BSNL ప్రయోజనం: Vi కి ఉన్న విస్తృతమైన టవర్ నెట్వర్క్ను వాడుకుని BSNL తన 4G, 5G సేవలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు.
- Vi ప్రయోజనం: BSNL వద్ద ఉన్న 700 MHz వంటి విలువైన స్పెక్ట్రమ్ బ్యాండ్లను 5G సేవల కోసం Vi ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
- కస్టమర్లకు లాభం: ఏ మూలకెళ్లినా సిగ్నల్ దొరకడం (Connectivity) సులభం అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు తీరుతాయి.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నట్లు ఇది ప్రధానంగా రెండు కంపెనీల మధ్య జరిగే వాణిజ్యపరమైన ఒప్పందం. అయితే, ప్రభుత్వం పెద్ద వాటాదారుగా ఉన్నందున ఈ 'వ్యూహాత్మక దోస్తీ' త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే, భారత టెలికాం మార్కెట్లో జియో, ఎయిర్టెల్లకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!














Click it and Unblock the Notifications