2018లో బడ్జెట్: వేతన జీవులకు గుడ్ న్యూస్!.. 80-సీ కింద రూ.2 లక్షలకు మినహాయింపు పెంపు?
న్యూఢిల్లీ:
ప్రతియేటా
మార్చి,
ఏప్రిల్
నెలల్లో
వేతన
జీవులు
తమ
వేతనాలపై
చెల్లించాల్సిన
ఆదాయం
పన్ను..
మినహాయింపులు
పొందే
అవకాశాలను
ఒకసారి
పరిశీలించుకుంటారు.
ఐటీ
చట్టం
80
-
సీ
సెక్షన్
కింద
వచ్చే
ఆర్థిక
సంవత్సరం
బడ్జెట్లో
మినహాయింపులు
పెంచే
దిశగా
ఆర్థికమంత్రి
అరుణ్జైట్లీ
యోచిస్తున్నట్లు
తెలుస్తోంది.
ఆదాయపన్ను
చట్టం-1961లోని
సెక్షన్
80సీ
కింద
ఆదాయ
పన్ను
మినహాయింపు
పరిమితిని
ప్రస్తుతమున్న
రూ.1.5
లక్షల
నుంచి
రూ.2
లక్షలకు
పెంచనున్నట్లు
భావిస్తున్నారు.
ఇంతకుముందు
2014లో
రూ.
లక్ష
నుంచి
రూ.1.50
లక్షలకు
పెంచుతూ
కేంద్ర
ఆర్థిక
శాఖ
మంత్రి
నిర్ణయం
తీసుకున్నారు.
ఇప్పుడు
ఇది
80సీలోని
ఒకట్రెండు
పన్ను
ఆదా
అంశాలకే
పరిమితమయ్యే
అవకాశం
ఉందని
విశ్వసనీయ
వర్గాల
సమాచారం.
సెక్షన్
80సీ
పరిమితిని
రూ.2
లక్షలకు
పెంచితే
అదనంగా
ఆదా
అయ్యే
మొత్తం
రూ.2,575
(10%),
రూ.10,300
(20%),
రూ.15,450
(30%)గా
ఉండనున్నది.
తద్వారా
2016
నవంబర్
ఎనిమిదో
తేదీన
నోట్ల
రద్దు,
గతేడాది
జూలైలో
జీఎస్టీ
అమలులోకి
తేవడంతో
ఆర్థిక
వ్యవస్థలో
మందగమనం
సాగుతున్నట్లు
ప్రభుత్వం
ఒప్పుకున్నట్లే
అవుతుందని
విశ్లేషకులు
అభిప్రాయ
పడుతున్నారు.
ఐటీ
చట్టంలోని
80
-
సీ
ప్రకారం
మినహాయింపు
పరిమితి
పెంచడం
వల్ల
వచ్చే
ఆర్థిక
సంవత్సరం
ఆదాయం
పన్ను
రూపేణా
వచ్చే
ప్రభుత్వ
ఖజానాకు
వచ్చే
ఆదాయం
తగ్గుముఖం
పడుతుందని
విశ్లేషకుల
అంచనా.
దీని
నుంచి
తప్పించుకునేందుకు
ఆర్తిక
మంత్రి
అరుణ్
జైట్లీ
ట్యాక్స్
బేస్
ను
విస్త్రుత
పరిచే
అవకాశాలు
పుష్కలంగా
ఉన్నాయి.
ప్రస్తుతం
ఎల్ఐసీ,
ఈక్విటీ
పొదుపు,
టైం
డిపాజిట్లకే
80
-
సీ
పరిమితి
వర్తింపు
ప్రస్తుతం
సెక్షన్
80-సీ
కింద
జీవితబీమా,
ఈక్విటీ
అనుసంధాన
పొదుపు
పథకాలు
(ఈఎల్ఎస్ఎస్),
ఐదేళ్ల
తపాలా
టైమ్
డిపాజిట్లు,
వయోవృద్ధుల
పొదుపు
పథకం(ఎస్సీఎస్ఎస్),
సుకన్య
సమృద్ధి
ఖాతా,
ప్రజాభవిష్యనిధి
(పీపీఎఫ్),
జాతీయ
పొదుపు
పత్రం
(ఎన్ఎస్సీ),
ఐదేళ్ల
పన్ను
ఆదా
బ్యాంకు
డిపాజిట్లు,
ఉద్యోగుల
భవిష్యనిధి(ఈపీఎఫ్)
తదితర
పెట్టుబడులు,
వ్యయాలపై
స్థూల
మొత్తం
ఆదాయంలో
ఏటా
రూ.1.5
లక్షల
దాకా
డిడక్షన్కు
అవకాశం
ఉంది.
ఎవరైనా
రూ.1.5
లక్షల్ని
ఇందులో
ఏదైనా
ఒక
పథకంలోగానీ,
వేర్వేరుగాగానీ
పెట్టవచ్చు.
బోధన
రుసుములు,
గృహ
రుణాల
చెల్లింపులు
వంటి
వ్యయాల
ద్వారా
కూడా
ప్రయోజనం
పొందవచ్చు.
గృహరుణాల
ముందస్తు
చెల్లింపునకు
రూ.50
వేల
రాయితీ
మోదీ
ప్రభుత్వం
గృహ
నిర్మాణ
రంగాన్ని
భారీగా
ప్రోత్సహించేందుకు
యత్నిస్తున్న
క్రమంలో
ఇళ్ల
కొనుగోలుదారులకు
కొన్ని
ప్రోత్సాహకాలు
గృహరుణంలో
అసలు
మొత్తం
చెల్లింపులో
అదనంగా
రూ.50
వేలదాకా
ప్రయోజనం
దక్కొచ్చు.
ప్రస్తుతం
గృహరుణం
ఉన్న
వారు
ముందస్తు
చెల్లింపు
ద్వారా
ప్రయోజనాన్ని,
కొత్తగా
ఇళ్లు
కొనుగోలు
చేసేవారు
గృహ
రుణాల
ద్వారా
అదనపు
ప్రోత్సాహకాల్ని
పొందే
అవకాశం
ఉంది.
గృహరుణం
కాకుండా
సెక్షన్
80సీ
కింద
మినహాయింపు
పరిమితి
పెంపుదలను
ఈఎల్ఎస్ఎస్
పెట్టుబడులకు
పరిమితం
చేసే
అవకాశం
ఉంది.
ఇవి
మూడేళ్ల
కాలవ్యవధితో,
పన్ను
ప్రయోజనాల్ని
అందించే
ఈక్విటీ
మ్యూచువల్
ఫండ్
పథకాలు.
దేశంలో
ఈక్విటీ
పెట్టుబడుల
సంస్కృతి
ఆశావహంగా
ఉండటంతో
ప్రభుత్వం
దీనిని
ఉపయోగించుకునే
అవకాశం
ఉంది.
2018
బడ్జెట్లో
టెర్మ్
బీమా
పథకాల
కోసం
సెక్షన్
80సీ
మినహాయింపు
పరిమితి
పెంచేట్లయితే
బీమా
కవరేజీ
పెరిగే
అవకాశం
ఉంది.
దీనివల్ల
ఆర్జిత
వ్యక్తి
మరణిస్తే
కుటుంబ
సభ్యుల
జీవనప్రమాణాలు
పడిపోకుండా
సాగే
అవకాశముంది.