Budget 2026: పన్నుల భారం పెరగనుందా? నిపుణులు హెచ్చరిక?
కేంద్ర బడ్జెట్-2026కు ఇంకా కొన్ని వారాలే ఉండటంతో దేశవ్యాప్తంగా పన్నుల విధానాలపై చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్, సర్చార్జ్, సంపన్నులపై అదనపు పన్నులు అనే అంశాలు ఇప్పుడు పాలసీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మధ్యతరగతికి ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయా? లేక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే దిశగా ధనవంతులపై భారం పెంచుతారా? అన్నది ఆసక్తిగా మారింది.
బడ్జెట్-2026 నేపథ్యంలో, జాతీయ మీడియా కథనాల్లో వస్తున్న ప్రధాన అంచనా ఏంటంటే... సంపన్నులపై కొత్త పన్నులు విధించే అవకాశాలు చాలా తక్కువ. ఇందుకు కారణం ఇప్పటికే ఉన్న పన్ను నిర్మాణమే గరిష్ఠ స్థాయికి చేరుకుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనపు సర్చార్జ్లు లేదా గతంలో రద్దు చేసిన వెల్త్ టాక్స్ (సంపద పన్ను)ను తిరిగి తీసుకురావడం వల్ల భారత్ నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం సర్చార్జ్ పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు ప్రాథమిక పన్నుతో పాటు సర్చార్జ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆదాయం ఉంటే - 10% సర్చార్జ్ ఉంది. ఇక రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లు వరకు - 15%, రూ.2 కోట్లు నుంచి రూ.5 కోట్లు వరకు - 25%, రూ.5 కోట్లు దాటితే - కొత్త పన్ను విధానంలో 25%, పాత విధానంలో 37% సర్చార్జ్ గా అమలవుతుంది. ఇప్పటికే ఈ స్థాయిలో పన్ను భారం ఉండటంతో, మరింత పెంపు చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
పన్నులు పెరిగితే ఎదురయ్యే ప్రమాదాలు
పిడబ్ల్యూసీ (PwC) పన్ను నిపుణుడు అమిత్ రాణా అభిప్రాయం ప్రకారం, అతి ఎక్కువ పన్నులు విధిస్తే క్యాపిటల్ ఫ్లైట్కు దారి తీయొచ్చు. అంటే సంపన్నులు, పెద్ద ఇన్వెస్టర్లు తక్కువ పన్నులు ఉన్న దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. స్టార్టప్లు, కొత్త పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టిలో కీలక పాత్ర పోషించే ఈ వర్గాన్ని ఇబ్బంది పెడితే దేశ ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
వెల్త్ టాక్స్ తిరిగి వస్తుందా?
వెల్త్ టాక్స్ను కేంద్ర ప్రభుత్వం 2015లోనే రద్దు చేసింది. అప్పట్లో దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండటం, అదే సమయంలో ఆస్తుల విలువ లెక్కించడం, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటమే ప్రధాన కారణాలు. ఇప్పుడు మళ్లీ వెల్త్ టాక్స్ తీసుకురావడం వల్ల బంగారం, షేర్లు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల విలువ అంచనా వేయడం క్లిష్టంగా మారుతుందని EY నిపుణురాలు సురభి మార్వా చెబుతున్నారు. ప్రస్తుత సర్చార్జ్ విధానమే సరళమైనదని ఆమె అభిప్రాయపడుతున్నారు.
బడ్జెట్ 2026లో మార్పులు ఉంటాయా?
డెలాయిట్ నిపుణుడు అలోక్ అగర్వాల్ ప్రకారం, ప్రభుత్వం ఇప్పటికే 2023లో గరిష్ఠ సర్చార్జ్ను 37% నుంచి 25%కు తగ్గించింది. ఇంత తక్కువ సమయంలోనే మళ్లీ పన్ను భారం పెంచడం రాజకీయంగా, ఆర్థికంగా సాధ్యపడకపోవచ్చని ఆయన అభిప్రాయం. జాతీయ మీడియా విశ్లేషణల ప్రకారం, ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం పన్నులు పెంచడం కంటే పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే విధానాలపైనే దృష్టి పెట్టే అవకాశం ఎక్కువ.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications