ఎరిక్సన్కు రూ.550కోట్లు చెల్లించండి: అనిల్ అంబానీ ఆర్కామ్కు తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) డిసెంబర్ 15లోపు రూ.550కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక, ఇకపై గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 30లోపు 12శాతం వడ్డీ రూ.550 కోట్లను చెల్లించాలని ఇంతకుముందు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆర్కామ్ డబ్బు చెల్లించకపోవడంతో మరోసారి గడువు పెంచింది. ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీ, మరో ఇద్దరు సీనియర్ అధికారులు దేశం విడిచి పోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎరిక్సన్ గతంలో పిటిషన్ దాఖలు చేసింది.

తమకు ఉద్దేశ పూర్వకంగానే అంబానీ డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించింది. ఆర్కామ్ ఇకపై ఆస్తులు విక్రయించేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. కాగా, తమ ఆస్తుల అమ్మకానికి టెలికాం శాఖ అనుమతి రాగానే ఎరిక్సన్కు డబ్బు చెల్లిస్తామని ఆర్కామ్ కోర్టుకు తెలిపింది.
అనుమతి విషయం తమ పరిధిలో లేదని తెలిపింది. స్పెక్ట్రమ్ను విక్రయానికి నిరభ్యంతర పత్రం ఇచ్చిన వారం రోజుల్లో నగదు చెల్లిస్తామని వెల్లడించింది. కాగా, ఇప్పటికే విక్రయించిన ఆస్తుల ద్వారా ఆర్కామ్కు రూ.5000కోట్లు వచ్చాయని ఎరిక్సిన్ తెలిపింది. తమకు ఆలస్యంగా డబ్బు చెల్లించాలనే ఆర్కామ్ టెలికాం అనుమతి అంటూ మెలిక పెడుతోందని ఆరోపించింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications