ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం.. పాత బుకింగ్లకే దిక్కులేని పరిస్థితి!
వంటగదిలో గ్యాస్ వెలగడం లేదు.. సిలిండర్ కోసం సామాన్యుడి నిరీక్షణ తీరడం లేదు. దేశీయంగా ఎల్పీజీ (LPG) సరఫరా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గత రెండు నెలలతో పోలిస్తే మార్చి నెలలో గ్యాస్ దిగుమతులు ఏకంగా 40 శాతానికి పైగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా గొలుసు తెగిపోవడం వెరసి.. గృహ వినియోగదారుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
షిప్-ట్రాకింగ్ డేటా సంస్థ 'క్ప్లర్' (Kpler) నివేదిక ప్రకారం.. మార్చిలో భారత్ కేవలం 1.22 మిలియన్ టన్నుల ఎల్పీజీని మాత్రమే దిగుమతి చేసుకోగలిగింది. జనవరితో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణా స్తంభించిపోయింది. ఫలితంగా మనకు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి రావాల్సిన షిప్మెంట్లు 40 శాతం మేర నిలిచిపోయాయి.

ఆదుకున్న అమెరికా.. మళ్ళీ మొదలైన ఇరాన్ సరఫరా..
ఈ క్లిష్ట సమయంలో అమెరికా భారత్కు పెద్ద దిక్కుగా నిలిచింది. మార్చిలో అమెరికా నుండి దిగుమతులు 56 శాతం పెరిగి, దాదాపు 420,000 టన్నుల గ్యాస్ దేశానికి చేరింది. అటు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇరాన్ నుండి కూడా 43,000 టన్నుల ఎల్పీజీ దిగుమతులు పునరుద్ధరించబడ్డాయి. అయినప్పటికీ, దేశ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉండటంతో ఈ స్వల్ప ఉపశమనం సరిపోవడం లేదు.
పరిశ్రమలకూ పాకిన కొరత..
దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు చమురు మంత్రిత్వ శాఖ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. పెట్రోకెమికల్స్ తయారీకి వాడే హైడ్రోకార్బన్ స్ట్రీమ్లను ఎల్పీజీ ఉత్పత్తి వైపు మళ్లించాలని రిఫైనరీలను ఆదేశించింది. అయితే, దీనివల్ల ఫార్మా, రసాయన, ఆహార రంగాల్లో ముడిసరుకు కొరత ఏర్పడటంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పాక్షికంగా వెనక్కి తీసుకుంటోంది. ఫలితంగా ఇటు గృహ అవసరాలకు, అటు పరిశ్రమలకు మధ్య సమతుల్యత దెబ్బతిని గందరగోళం నెలకొంది.
క్యూలైన్లలో సామాన్యుడు.. బ్లాక్ మార్కెట్ దందా..
క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లోనూ సిలిండర్ అందకముందే "డెలివరీ పూర్తయింది" అనే మెసేజ్లు వస్తుండటం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. సీల్ చేసిన సిలిండర్లలోనూ 4 కిలోల వరకు తక్కువ బరువు ఉంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, సరఫరా గొలుసు పునరుద్ధరించబడే వరకు ఈ గ్యాస్ కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..! లెక్కలతో సహా..! -
పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు? -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
కేంద్రం వరాల సునామీ -
5 కేజీల సిలిండర్లకూ దిక్కులేదు -
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్మైండ్ హతం! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications