12ఏళ్లకు పెప్సికో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ఇంద్రానూయీ
వాషింగ్టన్: పెప్సికో సీఈఓ ఇంద్రానూయీ ఈ ఏడాది అక్టోబర్ 3న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. రామన్ లగౌర్టా అనే సెకండ్ ర్యాంక్ ఎగ్జిక్యూటివ్ను ఆమె స్థానంలో కంపెనీ బోర్డు ఎన్నుకున్నట్లు తెలిపింది.
పెప్సికో సంస్థకు సీఈఓగా ఇంద్రానూయీ 12ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆమె మొత్తం సంస్థలో 24ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆమె కంపెనీని లాభాల బాటలో నడిపించారు. 2006 నుంచి 2017 వరకు 162శాతం షేర్హోల్డర్ రిటర్న్, డివిడెంట్ బైబ్యాక్స్ ద్వారా షేర్ హోల్డర్స్కు 79.4బిలియన్లు రిటర్న్ చేయడం జరిగింది. మొత్తం రెవెన్యూ 80శాతం పెరగింది.

కస్టమర్లకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందివ్వడమే తమ ప్రాధాన్యత అని గట్టిగా నమ్మేవారు భారత సంతతికి చెందిన సీఈఓ. ఇండస్ట్రీ రీసైక్లింగ్ హాబిట్స్ మెరుగుపరిచే చర్యలు కూడా ఆమె చేపట్టారు.
కాగా, రామన్ లగౌర్టా పెప్సికోకు ఆరవ సీఈఓగా నూయీ అనంతరం బాధ్యతలు చేపట్టనున్నారు. స్పానిస్ కన్ఫెక్షనరీ కంపెనీ, చుపా చుప్స్. ఎస్.ఏలో పనిచేసిన లగౌర్టా.. 22 ఏళ్ల క్రితమే పెప్సికోలో చేరారు. కాగా, ప్రస్తుతానికి ఇది తప్ప మిగితా స్థానాల్లో ఎలాంటి మార్పు లేవని పెప్సికో సంస్థ తెలిపింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications