అవిశ్వాసంలో బీజేపీ గెలుపు, ఐటీ అండ: లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఈ ఉదయం మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం దాకా మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగాయి. అయితే అవిశ్వాస తీర్మానంలో బీజేపీ నెగ్గుతుందనే ధీమాతో మధ్యాహ్నం నుంచి సూచీలు పుంజుకున్నాయి. దీనికి తోడు ఐటీ షేర్లలో కొనుగోళ్లు వెళ్లువెత్తాయ.
దీంతో లాభాలు నమోదయ్యాయి. ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల షేర్ల లాభపడడం సూచీలకు కలిసి వచ్చింది. లోహాలు, ఆటో మొబైల్స్ రంగాలు నష్టపోయాయి.

ప్రారంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నానికి సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 11వేల పైన ట్రేడ్ అయింది. చివరలో సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 11వేల పాయింట్ల వద్ద ముగిసింది.












Click it and Unblock the Notifications