మరింత క్షీణించిన డాలర్తో రూపాయి మారకం విలువ రూ.74.48
ముంబై: డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణత కొనసాగుతూనే ఉంది. గురువారం మరో 24 పైసలు పతనమవడంతో డాలరుతో రూపాయి మారకం విలువ ఓ దశలో రూ.74.48తో జీవనకాల కనిష్ఠానికి చేరింది.
అమెరికా కరెన్సీకి దిగుమతిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, ద్రవ్యలోటు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ దెబ్బతో గురువారంనాటి స్టాక్మార్కెట్లు కూడా కుదేలైపోతున్నాయి.

కాగా, బుధవారం రూపాయి రికార్డు కనిష్ఠం నుంచి కోలుకుంది. చివరకు 19 పైసలు బలపడి 74.20 వద్ద ముగిసింది. కాగా గురువారం ఫారెక్స్ ట్రేడింగ్ ఆరంభంలోనే రూపాయి మారకం విలువ పతనమై రూ.74.37 వద్ద మొదలైంది.
ఆ తర్వాత మరింతగా క్షీణించి తాజా జీవనకాల కనిష్ఠమైన రూ.74.45పైసలకు చేరింది. నిన్న విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1096కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. డాలరుకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా పెరగడం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications