మరింత క్షీణించిన డాలర్తో రూపాయి మారకం విలువ రూ.74.48
ముంబై: డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణత కొనసాగుతూనే ఉంది. గురువారం మరో 24 పైసలు పతనమవడంతో డాలరుతో రూపాయి మారకం విలువ ఓ దశలో రూ.74.48తో జీవనకాల కనిష్ఠానికి చేరింది.
అమెరికా కరెన్సీకి దిగుమతిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, ద్రవ్యలోటు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ దెబ్బతో గురువారంనాటి స్టాక్మార్కెట్లు కూడా కుదేలైపోతున్నాయి.

కాగా, బుధవారం రూపాయి రికార్డు కనిష్ఠం నుంచి కోలుకుంది. చివరకు 19 పైసలు బలపడి 74.20 వద్ద ముగిసింది. కాగా గురువారం ఫారెక్స్ ట్రేడింగ్ ఆరంభంలోనే రూపాయి మారకం విలువ పతనమై రూ.74.37 వద్ద మొదలైంది.
ఆ తర్వాత మరింతగా క్షీణించి తాజా జీవనకాల కనిష్ఠమైన రూ.74.45పైసలకు చేరింది. నిన్న విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1096కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. డాలరుకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా పెరగడం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications