మొండిబకాయిల ఎఫెక్ట్: క్యూ4లో ఎస్బీఐకి రూ. 7,718కోట్ల నష్టం

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మొండి బకాయిలు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నిరర్థక ఆస్తులు పేరుకుపోతుండటంతో జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకు అంచనాలకు మించి భారీ నష్టాలను నమోదు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ.7,718కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.

ఈ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం మాత్రం రూ.68,436.06కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.57,720.07కోట్లుగా ఉంది. ఇక ఈ త్రైమాసికంలో బ్యాంకు ప్రొవిజన్లు రూ.28,096కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో ఇవి రూ.11,740కోట్లుగా ఉన్నాయి.

 SBI sees record 7,718cr loss in Q4

బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 10.91శాతానికి పెరిగాయి. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఇవి 10.35శాతం ఉండగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 9.1శాతంగా ఉన్నాయి.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు 5.73శాతానికి పెరిగాయి. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 5.61శాతంగా ఉండగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 5.19శాతంగా ఉన్నాయి.

అంతకు ముందు డిసెంబరు త్రైమాసికంలో రూ. 2,416.37కోట్ల నికర నష్టాన్ని చవిచూడగా.. మార్చి త్రైమాసికంలో నష్టం మరింత పెరిగింది. కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 2,814.82కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+