Ayurvidic massage: మూకలికలు కాదు మూలుగులు, సోషల్ మీడియాలో వల, ఆంటీలతో !
చెన్న/ మదురై: కరోనా వైరస్ (COVID-19), లాక్ డౌన్ కారణంగా చాలా వరకు వ్యాపారాలు తల్లకిందులైనాయి. ఆధాయం లేక చాలా మంది వ్యాపారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయుర్వేద మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మేధావి మైండ్ లో భలే ఆలోచన వచ్చింది. కరోనా వైరస్ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఆయుర్వేద ఔషదాలు, మందులు, నాటు మందులు ఉపయోగిస్తున్నారని, అలాంటి వారితో పాటు రెగ్యులర్ కస్టమర్లు మళ్లీ పుంజుకోవడానికి అమ్మాయిలు ,ఆంటీలను రంగంలోకి దింపాడు. అంతే సోషల్ మీడియా నెట్ వర్క్ తో అతని అసలు వ్యాపారం మొదలుపెట్టాడు. ఆయుర్వేద మసాజ్ సెంటర్ లో మూలికల వాసనకు బదులుగా మూలుగులు వినిపించడంతో అసలు బండారం బయటపడింది.

చెన్నై పేరు చెబితే హడల్
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో తమిళనాడు రాజధాని చెన్నై సిటీ పేరు వింటే ప్రజలు హడలిపోతున్నారు. చెన్నై సిటీలో విపరీతంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో లాక్ డౌన్ ను పొడగిస్తూ వస్తున్నారు. అయితే కొన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం అనేక షరుతులు విధించింది.

అంబత్తూర్ ఆయుర్వేద మసాజ్ సెంటర్
చెన్నై సిటీలోని అంబత్తూర్ ప్రాంతంలోని ఒరాగడమ్ లోని వడివేలు మొదలియార్ రోడ్డులో ఓ ఆయుర్వేద మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. చెన్నై సిటీలోని వాషర్ పేట్ లో నివాసం ఉంటున్న సతీష్ వనే వ్యక్తి కొంతకాలంగా ఈ ఆయుర్వేద సమాజ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో కేరళ ఆయుర్వేద మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు.

లాక్ డౌన్ లో వ్యాపారం ఢీలా
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో సతీష్ నిర్వహిస్తున్న ఆయుర్వేద మసాజ్ సెంటర్ కు వచ్చే కస్టమర్లు సంఖ్య భారీగా తగ్గిపోయింది. లాక్ డౌన్ కారణంగా ఇంతకాలం నష్టాలు వచ్చాయని, ఎలాగైనా తన వ్యాపారం పుంజుకోవాలని సతీష్ ఆలోచించాడు. కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానిక చాలా మంది ఆయుర్వేద ఔషదాలు ఉపయోగించడానికి సిద్దం అవుతున్నారని, మనం కూడా ఆయుర్వేద ఔషదాలతో మసాజ్ చేసి డబ్బులు బాగా సంపాధించాలని సతీష్ కలలుకన్నాడు.

మూలికల వాసనేలేదు... మూలుగులు మాత్రం !
కొన్ని రోజులుగా సతీష్ నిర్వహిస్తున్న ఆయుర్వేద మసాజ్ సెంటర్ కు వచ్చి వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సతీష్ మసాజ్ సెంటర్ కు మాత్రమే కస్టమర్లు ఎక్కువగా వెలుతున్నారని, మనకు ఎందుకు కస్టమర్లు రావడం లేదని సాటి మసాజ్ సెంటర్ నిర్వహకులు తలలు పట్టుకున్నారు. ఇదే సమయంలో ఆయుర్వేద మసాజ్ సెంటర్ నుంచి మూలికల వాసన మాత్రం రావడం లేదని, మూలుగులు ఎక్కువగా వినిపిస్తున్నాయని గుర్తించిన స్థానికులు సార్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ? అంటూ అంబత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఐదు మంది అందగత్తెలు
పోలీసులు మఫ్టీలో మసాజ్ చేసుకునే ముసుగులో ఆయుర్వేద మసాజ్ సెంటర్ లోకి వెళ్లారు. అంతే అందమైన ఐదు మంది అమ్మాయిలు, ఆంటీలు మఫ్టీలో వచ్చిన పోలీసులను రెచ్చగొడుతూ రాసలీలలు సాగించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆయుర్వేద మసాజ్ జరగడం లేదని, హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు.

సోషల్ మీడియాలో స్కెచ్ వేసిన సతీష్
వ్యాపారం పుంజుకోవడానికి, అమ్మాయిలు, ఆంటీల కోసం వెంపర్లాడుతున్న వారికి గాలయం వెయ్యడానికి సతీష్ హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నాడని పోలీసులు అన్నారు. సోషల్ మీడియాలో కస్టమర్లను ఆకర్షిస్తున్న సతీష్ ఆయుర్వేద మసాజ్ సెంటర్ లో అమ్మాయిలు, వయసులో ఉన్న అందమైన ఆంటీలను పెట్టి హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నాడని పోలీసులు ఆధారాలు సేకరించారు.

అందమైన అమ్మాయిలు, ఆంటీలు
హైటెక్ వేశ్యవాటిక కేంద్ర నిర్వహకుడు సతీష్ ను అరెస్టు చేసి ఐదు మంది అమ్మాయిలు, ఆంటీలను ప్రభుత్వ సంక్షేమ శాఖ పునరావాస కేంద్రానికి తరలించి విచారణ చేస్తున్నామని అంబత్తూరు పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఆయుర్వేద మసాజ్ పేరుతో సతీష్ మంచి బిజినెస్ చేస్తున్నాడని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications