Chennai Rains : చెన్నై సహా నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు స్కూళ్లు, ఆఫీసుల మూసివేత
తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలతో నాలుగు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో చెన్నె, కాంచీపురం, చెంగల్ పట్టు, తిరువళ్లూరు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లను మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నాలుగు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని స్కూళ్లు, ఆఫీసులు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. అలాగే ట్రాఫిక్ స్తంభించి, విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. ఐఎండీ తాజా నివేదికల ప్రకారం, చెన్నై, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని గంటల్లో వర్షాలు ఆగిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఇప్పటికీ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

డీజీపీ కార్యాలయం, నుంగంబాక్కం సమీపంలోని రెండు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది, నాలుగు చోట్ల 19 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నీటి ఎద్దడి కారణంగా మొత్తం నాలుగు సబ్వేలను మూసివేశారు. అంతకుముందు, తిరువళ్లూరు కలెక్టర్ తన ట్వీట్లో పరివాహక ప్రాంతాల్లో నిరంతర వర్షం, ఇన్ఫ్లో కారణంగా రెడ్హిల్స్ ట్యాంక్ నుండి ముందుజాగ్రత్త చర్యగా 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ఇన్ఫ్లో సుమారు 2000 క్యూసెక్కులు ఉందన్నారు. మిగులు ఛానల్ ఒడ్డున లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కార్యాలయంలోని వరద కంట్రోల్ రూమ్ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నాలుగు జిల్లాల అధికారులు ఈ రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు ఇచ్చారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications