హర్ ఘర్ తిరంగా: చెన్నైలో గవర్నర్ తమిళిసై- ఇంటిపై జాతీయ జెండా రెపరెపలు
చెన్నై: ఇంకొన్ని గంటల్లో యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోనుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడబోతోన్నాయి. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్ను రూపొందించింది ప్రభుత్వం
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికారులు.. ఈ కార్యక్రమాలకు హాజరవుతారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
పంద్రాగస్టు వేడుకల సూచికంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి ఇంటి మీదా జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని సూచించింది. సోషల్ మీడియాను వినియోగించే ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని తమ డీపీలుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేసింది.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. చెన్నైలోని తన నివాసంపై జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తాను హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నానని, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించానని పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ తమ ఇంటిపై జెండాలను ఎగురవేయాలని కోరారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications