Illegal affair: భార్య లేడీస్ టైలర్, భర్తకు 24 గంటలు డౌట్, సీక్రేట్ ఏజెంట్ ?, సింపుల్ గా చంపేసి డ్రామా!
చెన్నై/తేనీ: పెద్దల నిశ్చయించిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. భార్య లేడీస్ టైలర్ గా పని చేస్తోంది. లేడీస్ టైలర్ పని చేస్తున్న భార్య రోజూ బయటకు వెళ్లి వస్తోంది. బయటకు వెళ్లి వస్తున్న భార్య ఇంట్లో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ లో బయట వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడుతోంది.
తన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్యకు తెలీకుండా భర్త ఆమె మీద నిఘా వేసి సీక్రేట్ ఏజెంట్ లాగా ఆరా తీశాడు. రానురాను భార్య మీద ఎక్కువ అనుమానం పెంచుకున్న భర్త ఆమె మీద రగిలిపోయాడు. చివరికి భార్య గొంతు నులిమి చంపేసిన భర్త పీడపోయింది అని ఊపిరిపీల్చుకున్నాడు.
18 ఏళ్ల క్రితం పెళ్లి
తమిళనాడులోని తేని జిల్లాలోని చన్నమనూరు అళఘర్ సామినగర్ లో రాజేష్ కుమార్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం విరూద్ నగర్ జిల్లాలోని అవరంగుళం ప్రాంతానికి చెందిన జయరామన్ కుమార్తె ప్రభా (35) అనే మహిళను ఇచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. 18 ఏళ్ల క్రితం రాజేష్ కుమార్, ప్రభాల పెళ్లి జరిగింది.
పిల్లలు పుట్టిన తరువాత?
పెద్దల నిశ్చయించిన పెళ్లి చేసుకున్న రాజ్ కుమార్, ప్రభ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రాజ్ కుమార్, ప్రభా దంపతులకు 17 ఏళ్లు, 14 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రభా భర్త రాజ్ కుమార్ చిన్న వ్యాపారం చేస్తున్నాడు. రాజ్ కుమార్ భార్య ప్రభా లేడీస్ టైలర్ గా పని చేస్తోంది.
బయటకు వెళ్లిన భార్య మీద డౌట్
లేడీస్ టైలర్ పని చేస్తున్న రాజ్ కుమార్ భార్య ప్రభా రోజూ బయటకు వెళ్లి వస్తోంది. బయటకు వెళ్లి వస్తున్న భార్య ప్రభా ఇంట్లో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ లో బయట వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడుతోంది. తన భార్య ప్రభాకు అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త రాజ్ కుమార్ కు అనుమానం మొదలైయ్యింది. భార్య ప్రభాకు తెలీకుండా రాజ్ కుమార్ ఆమె మీద నిఘా వేశాడు.
భార్యను చంపేసి పీడపోయింది అనుకున్న భర్త
రానురాను భార్య ప్రభా మీద ఎక్కువ అనుమానం పెంచుకున్న ఆమె భర్త రాజ్ కుమార్ ఆమె మీద రగిలిపోయాడు. ఇదే విషయంలో రాజ్ కుమార్ అతని భార్య ప్రభాతో కొంతకాలంగా గొడవలు పడుతున్నాడు. చివరికి భార్య గొంతు నులిమి చంపేసిన రాజ్ కుమార్ తన భార్య పీడపోయింది అని ఊపిరిపీల్చుకున్నాడు.
బంధువుకు ఫోన్ చేసి డ్రామాలు
వెంటనే బంధువు జయరామ్ కు ఫోన్ చేసిన రాజ్ కుమార్ తన భార్య చనిపోయిందని చెప్పాడు. జయరామ్ కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోస్టుమార్టం నివేదికలో ప్రభాను గొంతు నులిమి చంపేశారని వెలుగు చూసింది. పోలీసులు రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే తన భార్య ప్రభా అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తెందని ఆమెను తానే హత్య చేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.