Illegal affair: బేకరిలో భర్తకు బిస్కెట్లు, ప్రియుడితో నర్సు ఎంజాయ్, ప్రియుడి బ్లడ్ స్కెచ్ తో షాక్!
చెన్నై/ తిరుచ్చి: దంపతులు వ్యాపారం చెయ్యాలని అనుకున్నారు. తెలిసిన వారి సహాయంతో బేకరిని లీజుకు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టారు. ఇదే సమయంలో భార్య ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది. ఆసుపత్రిలో డ్యూటీ పూర్తి అయిన తరువాత భార్య ఆమె భర్త నిర్వహిస్తున్న బేకరి దగ్గరకు చేరుకుని వ్యాపారం చేస్తున్న భర్తకు సహాయం చేసేది. ఇదే సమయంలో భార్య ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలాకాలం పాటు ప్రియుడితో నర్సు ఎంజాయ్ చేసింది. భర్త మాత్రం బేకరిలో బిస్కెట్లు, బన్నులు అమ్ముకుంటూ కాలం గడిపాడు.
కొన్ని సంవత్సరాల పాటు ప్రియుడితో ఎంజాయ్ చేసిన నర్సు ఆమె అక్రమ సంబంధం విషయం భర్తకు తెలీకుండా జాగ్రత్తపడింది. ఇదే సమయంలో బేకరీ లీజు గడుపు పూర్తి కావడంతో నర్సు, ఆమె భర్త సొంత ఊరికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. తన ప్రియురాలు తనను వదిలేసి వెళ్లిపోందని నర్సు ప్రియుడు ఆవేదన చెందాడు. ఇళ్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయిన నర్సు ఇంట్లో రక్తపు మరకలు పడటం, తలుపు సందుల్లో నుంచి రక్తం బయటకు రావడం చూసిన స్థానికులు హడలిపోయారు.
ఇదే సమయంలో రక్తపు మరకలు పడిన షర్టు నర్సు ఇంటి సమీపంలో పడింది. అప్పటికే నర్సు దంపతులు ఇళ్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోవడంతో స్థానికులు హడలిపోయారు. ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసిన ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయిన నర్సు ఇంట్లో హత్య జరిగిందని, శవం మాయం చేశారని చెప్పాడు. పోలీసులు వెళ్లి నర్సు ఇంట్లో పరిశీలించి అసలు మ్యాటర్ తెలుసుకుని బిత్తరపోయారు.
Russia vs Ukraine: రష్యాకు చావు దెబ్బ, సిఫ్ట్ నుంచి ఔట్, వేల కోట్ల యూరోల లావాదేవీలకు చెక్!
బేకరి లీజుకు తీసుకున్న దంపతులు
తమిళనాడులోని తిరుపత్తూరులో ముత్తుకుమార్ (35), సంధ్య (27) దంపతులు నివాసం ఉంటున్నారు. సంధ్య తిరుచ్చిలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నది. ముత్తుకుమార్, సంధ్య దంపతులు వ్యాపారం చెయ్యాలని అనుకున్నారు. తెలిసిన వారి సహాయంతో తిరుచ్చిలోని తిరువనైకావల్ రోడ్డులో బేకరిని లీజుకు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టారు.
భార్య అక్రమ సంబంధం
ఆసుపత్రిలో డ్యూటీ పూర్తి అయిన తరువాత ముత్తుకుమార్ భార్య సంధ్య ఆమె భర్త నిర్వహిస్తున్న బేకరి దగ్గరకు చేరుకుని వ్యాపారం చేస్తున్న భర్తకు సహాయం చేసేది. ఇదే సమయంలో సంధ్యకు దురై బాలన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. నర్సు సంద్యా, బాలన్ ల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.
భార్య ఎంజాయ్ చేస్తుంటే బేకరిలో బిస్కెట్లు అమ్ముకుంటున్న భర్త
చాలాకాలం పాటు సంధ్య ఆమె ప్రియుడు బాలన్ తో ఎంజాయ్ చేసింది. సంధ్య భర్త ముత్తుకుమార్ మాత్రం బేకరిలో బిస్కెట్లు, బన్నులు అమ్ముకుంటూ కాలం గడిపాడు. కొన్ని సంవత్సరాల పాటు ప్రియుడు బాలన్ తో ఎంజాయ్ చేసిన నర్సు సంధ్య ఆమె అక్రమ సంబంధం విషయం భర్త ముత్తుకుమార్ కు తెలీకుండా జాగ్రత్తపడింది. ఇదే సమయంలో బేకరీ లీజు గడుపు పూర్తి కావడంతో నర్సు సంధ్య, ఆమె భర్త ముత్తుకుమార్ సొంత ఊరు తిరుపత్తూరుకు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు.
ప్రియురాలి ఇల్లు మొత్తం రక్తపు మరకలు
తన ప్రియురాలు సంధ్య తనను వదిలేసి వెళ్లిపోందని నర్సు ప్రియుడు బాలన్ ఆవేదన చెందాడు. ఇళ్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయిన నర్సు సంధ్య ఇంట్లో రక్తపు మరకలు పడటం, తలుపు సందుల్లో నుంచి రక్తం బయటకు రావడం చూసిన స్థానికులు హడలిపోయారు. ఇదే సమయంలో రక్తపు మరకలు పడిన షర్టు నర్సు సంధ్య ఇంటి సమీపంలో పడింది. అప్పటికే నర్సు సంధ్య, ముత్తుకుమార్ దంపతులు ఇళ్లు ఖాళీ చేసుకుని తిరుపత్తూరు వెళ్లిపోవడంతో స్థానికులు హడలిపోయారు.
హడలిపోయిన పోలీసులు
ఓ వ్యక్తి తిరుచ్చి పోలీసులకు ఫోన్ చేసిన ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయిన నర్సు సంధ్య ఇంట్లో హత్య జరిగిందని, శవం మాయం చేశారని చెప్పాడు. పోలీసులు వెళ్లి నర్సు సంధ్య ఖాళీ చేసిన ఇంట్లో పరిశీలించి అసలు మ్యాటర్ తెలుసుకుని బిత్తరపోయారు. నర్సు సంద్య ఇంట్లో మేక రక్తం తీసుకెళ్లి చల్లారని, ఆ రక్తం ఎండిపోయిందని పోలీసులు గుర్తించారు.
నర్సు ప్రియుడి మ్యాటర్ లీక్
సంధ్య, ఆమె భర్త ముత్తుకుమార్ మొబైల్ నెంబర్లు మాయం అయ్యాయి. సంధ్య ఇంట్లో హత్య జరిగింది అని ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందా అని పోలీసులు ఆరా తీశారు. ఆ సమయంలో సంధ్య ప్రియుడు బాలన్ మ్యాటర్ బయటకు వచ్చింది. బాలన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా ఊరికి వెళ్లిన పోయిన సంధ్యాను తిరుచ్చికి వెనక్కి పిలిపించాలని మేక రక్తం తీసుకు వచ్చి ఆమె ఇంట్లో చల్లానని, ఇదే సమయంలో షర్టుకు కూడా అదే రక్తం కలిపి ఇంటి సమీపంలో విసిరేశానని బాలన్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.