Lady: మహిళ మీద కన్ను వేసిన కామాంధుడు, ఫ్రెండ్స్ తో కలిసి ఎత్తుకెళ్లి ?, వీడియో తీసి బ్లాక్ మెయిల్, మైనర్లు!
చెన్నై/ తిరునల్వేలి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగా కాపురం చేస్తూ పిల్లలతో కలిసి జీవిస్తోంది. వివాహిత మహిళ మీద అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడి కన్నుపడింది. మహిళను ఎలాగైనా లొంగదీసుకుని ఎంజాయ్ చెయ్యాలని అతను అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ఆమె మాత్రం ఆ యువకుడికి లొంగలేదు. ఒంటరిగా వెలుతున్న వివాహిత మహిళను స్నేహితులతో కలిసి అటవి ప్రాంతంలోకి లాక్కొని వెళ్లిన ఆ యువకుడు ఆమె మీద అత్యాచారం చేశాడు.
మహిళ మీద సామూహిక అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆ సమయంలో మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఈవిషయం పోలీసులకు చెబితే రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. గంజాయి మత్తులో వివాహిత మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీశారని, నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని వెలుగు చూడటం కలకలం రేపింది.

మహిళ మీద కన్ను వేసిన నాగలింగం
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని ఇట్టమొళి ప్రాంతంలో 38 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. వాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగా కాపురం చేస్తూ పిల్లలతో కలిసి జీవిస్తోంది. వివాహిత మహిళ మీద అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న నాగలింగం అలియాస్ నాగ అనే యువకుడి కన్నుపడింది.

నిఘా వేసిన కామాంధులు
వివాహిత మహిళను ఎలాగైనా లొంగదీసుకుని ఎంజాయ్ చెయ్యాలని నాగలింగం అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ఆమె మాత్రం ఆ నాగలింగంకు లొంగలేదు. వారంలో రెండు రోజులు ఆమె సాటి మహిళలతో కలిసి గ్రామం సమీపంలోని అటవి ప్రాంతానికి వెళ్లి కట్టెలు కొట్టుకుని ఇంటికి తీసుకువస్తోంది.

ఒంటరిగా వెలుతుంటే?
రెండు రోజుల క్రితం వివాహిత మహిళ ఒంటరిగా అడవిలో కట్టెలు కొట్టుకుని రావడానికి బయలుదేరింది. ఆ సమయంలో విషయం గుర్తించిన నాగలింగం అతని స్నేహితులకు ఫోన్లు చేసి పిలిపించుకున్నాడు. ఒంటరిగా వెలుతున్న వివాహిత మహిళను నాగలింగం అతని స్నేహితులతో కలిసి అటవి ప్రాంతంలోకి లాక్కొని వెళ్లిపోయాడు.

గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీసిన కామాంధులు
నాగలింగం మొదట వివాహిత మహిళ మీద అత్యాచారం చేశాడు. తరువాత నాగలింగం వెంట వెళ్లిన నలుగురు స్నేహితులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. మహిళ మీద సామూహిక అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆ సమయంలో మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఈవిషయం పోలీసులకు చెబితే రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని నాగలింగం అతని స్నేహితులు ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు.

గ్యాంగ్ లీడర్ నాగలింగం అరెస్టు
మహిళకు వార్నింగ్ ఇచ్చిన నిందితులు అటవి ప్రాంతంలోకి వెళ్లిపోయారు. బాధితురాలు కేసు పెట్టడంతో జిల్లా ఎస్పీ సమయాసింగ్ మీనా, వల్లియూర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రాజకుమారి రంగంలోకి దిగి విచారణ చేశారు. మహిళ మీద సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు అయిన నాగలింగంను పోలీసులు అరెస్టు చేశారు.

గంజాయి మత్తులో గ్యాంగ్ రేప్..... ఇద్దరు మైనర్లు
గ్యాంగ్ రేప్ కేసులో మిగిలిన నలుగురు నిందితులు తప్పించుకున్నారని ఇన్స్ పెక్టర్ రాజకుమారి అంటున్నారు. గంజాయి మత్తులో వివాహిత మహిళ మీద నాగలింగం అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీశారని, నిందితులు గంజాయి సేవించడానికి బానిసలు అయ్యారని, నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని వెలుగు చూడటం కలకలం రేపింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications