Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

illegal affair: గోమతిని గోకిన మాయలోడు, పసిబిడ్డపై పెట్రోల్ పోసి నిప్పు, తల్లి ఆస్కార్ నటి !

చెన్న/శివకాశి/ తేన్ కాశి: కామంతో రగిలిపోయిన గోమతి అనే యువతి పెళ్లి కాకుండానే మాయలోడు అయిన ప్రియుడితో గోకించుకుని తల్లి అయ్యింది. అబార్షన్ చెయ్యడానికి అస్కారం లేకపోవడంతో వేరేదారిలేక ఇంతకాలం యువతి, ఆమె తల్లి ఆ విషయం బయటకు రాకుండా ఆస్కార్ విజేతల కంటే బాగా నటించి ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే బిడ్డ పుట్టిన తరువాత అక్రమ సంతానం మనకు వద్దు అంటూ తల్లి, కూతురు కలిసి నాలుగు రోజుల పసికందును నడిరోడ్డు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా చంపేశారు. ప్రపంచంలో ఎవ్వరు చెయ్యని పాపంపని చేసిన యువతి, ఆమె తల్లి పోలీసులకు అడ్డంగా చిక్కిపోవడంతో చిప్పకూడు తినడానికి సిద్దం అయ్యారు.

 ప్రియుడు మాయలోడు

ప్రియుడు మాయలోడు

తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని శంకరన్ కోవిల్ రైల్వే కాలనీలో నివాసం ఉంటున్న ఇంద్రాణి అనే మహిళ నివాసం ఉంటున్నది. ఇంద్రాణి కుమార్తె శంకర గోమతి అలియాస్ గోమతి (22) తనకు పరిచయం ఉన్న ఓ యువకుడితో తెగతిరిగేసింది. ప్రేమ, పెళ్లి అంటూ ఆ యువకుడు గోమతితో తిరిగాడు. ఇంట్లో తల్లి ఇంద్రాణి మాత్రమే ఉండటం, తండ్రి లేకపోవడంతో గోమితికి అడ్డు చెప్పేవాళ్లు కరువయ్యారు. గోమతి వెంట తిరిగిన యువకుడు పెద్ద మాయలోడు.

గోకడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోమతి

గోకడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోమతి


నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నాతో నువ్వు శారీరక సుఖం ఇప్పుడు పొందినా ఒక్కటే, పెళ్లి అయిన తరువాత అలా జరిగినా ఒక్కటే కాదనకు అంటూ మాయలోడు గోమతికి మాయమాటలు చెప్పాడు. ఇదే సమయంలో శారీరక సుఖం ఇవ్వడానికి గోమతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే గోమతితో విచ్చలవిడిగా అక్కడికి ఇక్కడికి తిరిగిన మాయలోడు ఆమెను గర్బవతిని చేశాడు.

అబార్షన్ కు ఆస్కారం లేదు

అబార్షన్ కు ఆస్కారం లేదు


మాయలోడి దెబ్బతో గోమతి గర్బవతి అయ్యింది. అయితే తాను గర్బవతి అనే విషయం గోమతి ఆలస్యంగా గుర్తించింది. గోమతి గర్బవతి అయ్యిందని తెలుసుకున్న ఆమె తల్లి ఇంద్రాణి మండిపడింది. పెళ్లి కాకుండానే గర్బవతి అయిన కుమార్తెను పిలుచుకుని తెలిసిన ఓ వైద్యురాలి దగ్గరకు వెళ్లి అబార్షన్ చెయ్యాలని ఆమె కాళ్లు పట్టుకుంది. అయితే ఇప్పటికే ఆలస్యం అయ్యిందని, మీరు అబార్షన్ అంటూ మొండిగా ప్రవర్తిస్తే గోమతి ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు ఇంద్రాణిని హెచ్చరించారు.

ఆస్కార్ విజేతల కంటే బాగా నటించారు

ఆస్కార్ విజేతల కంటే బాగా నటించారు

గోమతి గర్బవతి అయిన విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలీకుండా ఆమె తల్లి ఇంద్రాణి అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఇన్ని రోజులు గోమతిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇంద్రాణి తెలిసిన వారి సహాయంతో ఐదు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా గోమతికి ఇంటిలో కాన్పు చేయించింది. పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరూ అంటే తెలీదని బయట వాళ్లకు చెప్పలేమని, అందుకే ఈ పసికందును చంపేయాలని పురిటిబిడ్డ తల్లి గోమతి, ఆమె తల్లి ఇంద్రాణి డిసైడ్ అయ్యారు.

Recommended Video

    North Korea ను తాకిన Coronavirus.. Lockdown ప్రకటించిన Kim || Onendia Telugu
    పెట్రోల్ పోసి కాల్చి చంపేసి నాటకాలు

    పెట్రోల్ పోసి కాల్చి చంపేసి నాటకాలు

    పుట్టిన నాలుగు రోజులకే పసికందును అర్దరాత్రి తీసుకెళ్లి రైల్వేకాలనీ సమీపంలోని రోడ్డు పక్కన విసిరేసి ప్రాణాలు ఉన్నట్లే పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చేశారు. వేకువ జామున అటువైపు వెళ్లిన స్థానికులు 70 శాతం కాలిపోయిన చిన్నారి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుగుణా సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక లేడీ ఇన్స్ పెక్టర్ మంగైకెరసి తదితరులు విచారణ చెయ్యగా రోడ్డు మీద కాలి బూడిద అయ్యింది గోమతి బిడ్డ అని వెలుగు చూసింది. ఇంద్రాణి, ఆమె కుమార్తె గోమతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చెయ్యగా అసలు విషయం బయటకు వచ్చింది. అక్రమ సంతానం వద్దు అని నిర్ణయించి పసికందును చంపేశామని గోమతి, ఆమె తల్లి ఇంద్రాణి విచారణలో అంగీకరించారని జిల్లా ఎస్పీ సుగుణా సింగ్ మీడియాకు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+