Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దంపతుల దారుణ హత్య, తలుపు మీద ఐ సింబల్, విక్రమ్ సినిమా టైపులో కిల్లర్స్!

చెన్నై/తిరుచ్చి: అపరిచితుడు చిత్రంలో విక్రమ్ హత్య చేసి హత్యకు సంబందించి ఓ క్లూ ఇచ్చి వెళ్లిపోయిన తరహాలోనే తమిళనాడులోని తిరుచ్చిలో జంట హత్యలు జరగడం కలకలం రేపింది. జంట హత్యల కేసులో హంతకులు ఐ అనే కోడ్‌ను పెట్టి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. ఒకేసారి దంపతులు ఇద్దరిని హత్య చేసిన నిందితులు వారి నివాసం ఉంటున్న ఇంటి తలుపుకు ఐ అని రక్తంతో రాయడంతో అందరూ హడలిపోయారు.

భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం!

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తర్తియూర్ సమీపంలోని పి.మెట్టూరులో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం. రాజ్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన శారద అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాజ్ కుమార్, శారదా దంపతులు ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తున్నారు.

The killers brutally murdered the couple and left with a symbol of blood on the door in Trichy

ఉప్పిలియాపురం సమీపంలోని శోభనపురంలో విజయశేఖరన్‌ అనే వ్యక్తి భూమిని కౌలుకు తీసుకున్న రాజ్‌కుమార్ వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయ పొలం మధ్యలో ఉన్న ఇంట్లో రాజ్‌కుమార్, అతని భార్య శారదా నివాసం ఉంటున్నారు. రాజ్ కుమార్, శారదా దంపతపలు రాత్రి ఇంటికి వెళ్లారు.

తెల్లవారుజామున అక్కడికి వెళ్లిన అనుమానాస్పద వ్యక్తులు భార్యాభర్తలను కొడవలితో నరికి దారుణంగా హతమార్చారు. బంధువులు వెళ్లి చూడగా రాజ్ కుమార్, శారదా దంపతులు హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్షకు తరలించారు. అపరిచితుడు చిత్రంలో విక్రమ్ హత్య చేసి ఐ అనే కోడ్ వదిలేసి వెళ్లిన టైపులో తిరుచ్చి జంట హత్యల కేసులో హంతకులు కూడా ఐ అనే కోడ్‌ను పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

రాజ్‌కుమార్‌, శారద దంపతుల సెల్‌ఫోన్‌ కాల్స్‌పై విచారణ జరిపినా ఇప్పటివరకు ఎలాంటి క్లూ లభించలేదని పోలీసులు అంటున్నారు. ఘటనాస్థలికి సమీపంలోని రెండు సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీలు కూడా కేసు దర్యాప్తులో సహాయపడలేదని, నిందితుల ఆనవాళ్లు కనపడటం లేదని పోలీసులు అంటున్నారు. రాజ్ కుమార్, శారదా దంపతులను ఎవరు చంపారు? అనే ప్రశ్న మిస్టరీగా మిగిలిపోయింది.

The killers brutally murdered the couple and left with a symbol of blood on the door in Trichy

రాజ్ కుమార్, శారదా దంపతులు నివసించే ఇంటి తలుపుపై ​​రక్తంతో ఐ అనే ఆంగ్ల అక్షరం రాసి ఉండడం కలకలం రేపింది. దంపతులను చంపి వారి రక్తంతో ఐ కోడ్ రాశారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. జంట హత్యల కేసులో ఈ ఐ కోడ్ కీలక క్లూగా భావించిన పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో విచారణ ముమ్మరం చేశారు.

జంట హత్యలు చేసిన తర్వాత ఇదే తరహాలో తమను తాము గుర్తించుకున్న హంతకుల గురించి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఐ అనే ఒక్క తమిళ పదానికి ఆశ్చర్యం, ఐదు, సందేహం మొదలైన అర్థాలు ఉంటాయి. వాస్తవానికి, సీరియల్ కిల్లర్లు మరియు సైకో కిల్లర్లు తరచుగా హత్యలకు గుర్తుగా కొన్ని చిహ్నాలను పెడుతారని పోలీసులు అంటున్నారు. అదే తరహాలో ఇప్పుడు రాజ్‌కుమార్‌, శారద దంపతులు హత్యకు గురయ్యారేమోనన్న భయంతో స్థానికులు హడలిపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+