టీడీపీ సీనియర్ నేత కన్నుమూత: చంద్రబాబు, నారా లోకేష్ దిగ్భ్రాంతి
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. జిల్లాలోని శ్రీకాళహస్తిలో గల తన నివాసంలో ఈ తెల్లవారు జామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. పీఆర్ మోహన్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఆయిల్ కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్ మళ్లీ మండినా..డీజిల్ ధర తగ్గింపు
తెలుగుదేశం సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మెన్ పి.ఆర్ మోహన్ గారి
— N Chandrababu Naidu (@ncbn) July 12, 2021
మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. అంకితభావం, నిబద్దతలతో పార్టీకి సేవలందించిన మోహన్ గారి మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/lbaGEm0yvp
చిత్తూరు జిల్లాకు చెందిన పీఆర్ మోహన్.. దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వీరాభిమానిగా గుర్తింపు పొందారు. ఆ అభిమానంతోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. తెలుగుదేశం పార్టీ తరఫున పలు కేసులను వాదించారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి కృషి చేశారు.
ఆయన చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం.. తమ ప్రభుత్వ హయాంలో ఆయనను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ఛైర్మన్గా నామినేట్ చేసింది. రెండుసార్లు ఆయన శాప్ ఛైర్మన్గా పనిచేశారు. పీఆర్ మోహన్ ఆకస్మిక మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలుపుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారా లోకేష్.. పీఆర్ మోహన్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు.
టిడిపి సీనియర్ నేత,మాజీ శాప్ ఛైర్మెన్ పి.ఆర్ మోహన్ మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యాను.పార్టీ పట్ల అంకితభావం,నిబద్దత తో పనిచేసిన పి.ఆర్ మోహన్ మృతి పార్టీకి తీరని లోటు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబసభ్యులుకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/ZrmvK6vR5h
— Lokesh Nara (@naralokesh) July 12, 2021
పీఆర్ మోహన్ మృతి తనను దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు, నారా లోకేష్ అన్నారు. అంకితభావం, నిబద్దతలతో పార్టీకి సేవలందించారని గుర్తు చేశారు. పీఆర్ మోహన్ మరణం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు. శాప్ చైర్మన్గా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని, రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి శ్రమించాని అన్నారు. పీఆర్ మోహన్ మృతితో టీడీపీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని చెప్పారు.