అమ్మ మీకు వందనం: ఆక్సిజన్ మాస్క్ ధరించి మరీ వంట, సహనానికి నెటిజన్ల సెల్యూట్
కరోనా వైరస్ రూపాంతరాలు చెందుతోంది. సెకండ్ వేవ్ ఇంపాక్ట్ చాలానే ఉంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారిపై ప్రభావం చూపిస్తోంది. దీంతో ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు విధిగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. చికిత్స తీసుకున్న తర్వాత కూడా ఆక్సిజన్ అవసరం అయితే ఇంట్లోనే సిలిండర్ లేదా ఆక్సిజన్ కాన్సంట్రేటర్తో ప్రాణవాయువు తీసుకుంటున్నారు. దేశంలో ఇదీ ఇప్పుడు దాదాపు కామన్ అయిపోయింది. ఇంట్లో ొక కాన్సంట్రేటర్ ఉండాల్సిందే. అందుకే కాబోలు కొద్దిరోజుల క్రితం 40 వేల వరకు ఉన్న వాటి ధర.. ఇప్పుడు డబుల్, త్రిబుల్ అయ్యింది. ప్రాణవాయువు అందజేసే మిషన్లతో కూడా బిజినెస్ చేస్తున్నారు.
ఆక్సిజన్ పెట్టుకొని మరీ వంట
కరోనా సోకిన కొందరు ఆక్సిజన్ పెట్టుకోవడం కంపల్సరీ అవుతోంది. అయితే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ మహిళ ఆక్సిజన్ పెట్టుకోని మరీ వంట చేస్తున్నారు. వంట గదిలో చపాతీ కాలుస్తున్న చిత్రం కినిపిస్తోంది. మొహనికి ఆక్సిజన్ మాస్క్.. కొంచెం దూరంలో ఆక్సిజన్ సిలిండర్ ఉన్నాయి. చూడడానికి ఫోటో కాస్త భారంగా కనిపిస్తోంది. ఆమె అనారోగ్యం బారిన పడ్డ.. పని చేయడం తప్పడం లేదని అర్థం చేసుకోవచ్చు.
ఎవరో.. ఎక్కడో తెలియదు
ఫోటో ఎక్కడ ఎవరూ తీశారో.. ఎవరూ షేర్ చేశారో తెలియదు.. కానీ ఫోటో మాత్రం చర్చకు దారితీసింది. తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే పని చేయడం తప్పడం లేదని ఇండికేషన్.. కానీ ఆమె పరిస్థితి చూసి మాత్రం చాలా మంది జాలిపడుతున్నారు. అయ్యో పాపం అని అంటున్నారు. విధి మిమ్మల్నీ ఇంత పనిచేసిందా అని చర్చిస్తున్నారు. మీకు ఆ భగవంతుడు మంచి చేయాలని మనసారా కోరుకుంటున్నామని చెబుతున్నారు.
Recommended Video
జీవితాలు ఛిద్రం
కరోనా జీవితాలను ఛిద్రం చేసింది. చాలా కుటుంబాలను ఎడబాటుకు గురిచేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. దీనికి సజీవ సాక్ష్యం ఆ అమ్మ ఫోటోనే.. ఆక్సిజన్ పెట్టుకొని మరీ తన ఇంటి పనులను చేస్తోంది. నెటిజన్ల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా పనిచేస్తున్నారా అమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.