ఈ ఏడాది చివరి శక్తిమంతమైన అమావాస్య: డోన్ట్ మిస్
హిందూ ధర్మంలో ప్రతి అమావాస్యకు, ముఖ్యంగా పుష్య మాసంలో వచ్చే అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. పితృదేవతలను పూజించడానికి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి అత్యంత ఉద్దేశించిన రోజు ఇది. ఈ రోజున దానం, జపం, తర్పణం వంటివి చేయడం అత్యంత పుణ్యప్రదం. పురాణాల ప్రకారం- అమావాస్య రోజున పితృదేవతలు భూమిపైకి వస్తారని, తమ సంతానం ఆచరించిన పుణ్యకార్యాలకు ప్రసన్నమై సుఖసంతోషాలు, శ్రేయస్సును ఆశీర్వదిస్తారని ప్రగాఢ విశ్వాసం.
ఈ కారణంగా, పౌష్య అమావాస్య నాడు ఏర్పడే శుభ యోగాలు, ముహూర్తాల ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. పంచాంగం ప్రకారం ఈ ఏడాది పౌష్య అమావాస్య డిసెంబర్ 19 శుక్రవారం నాడు వస్తుంది. అమావాస్య తిథి తెల్లవారు జామున 4: 59 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 7: 12 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి నియమం ప్రకారం, అన్ని ధార్మిక, పితృ తర్పణ, స్నాన, దాన కార్యక్రమాలను డిసెంబర్ 19న నిర్వహించాలి.

పౌష అమావాస్య నాడు అనేక శుభ సంయోగాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం- ఈ రోజున సూర్య, చంద్రులు ఒకే రాశిలో ఉండటం అమావాస్య ప్రాముఖ్యత. ఈ ప్రత్యేక గ్రహస్థితి పితృ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, ఆత్మశుద్ధి వంటి కార్యాలకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు. ఈ సంయోగం ద్వారా పితృదేవతలు ప్రసన్నమై తమ వారసులకు ఆశీస్సులు అందిస్తారని నమ్మకం.
పుష్య అమావాస్య శుక్రవారం వస్తుండటం వల్ల లక్ష్మీదేవి కృపకు సంబంధించిన శుభ సంయోగం ఏర్పడింది. ఈ రోజున శ్రద్ధా భక్తులతో చేసే దానధర్మాలు, పుణ్యకార్యాల వల్ల ఆర్థిక స్థిరత్వం, సుఖ సంతోషాలు, కుటుంబ శ్రేయస్సు లభిస్తాయి. పౌష్య అమావాస్య రోజున ధార్మిక కార్యాలకు అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయి.
బ్రహ్మ ముహూర్తం: తెల్లవారు జామున 5: 19 నుండి 6: 14 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో స్నానం, ధ్యానం, జపం, తర్పణం చేయడం అత్యంత శుభప్రదం.
అమృత కాలం: ఉదయం 9: 43 నుండి 11:01 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే శుభ కార్యాలకు ప్రత్యేక సిద్ధి లభిస్తుంది.
అభిజిత్ ముహూర్తం: 11: 58 నుండి మధ్యాహ్నం 12: 39 నిమిషాల వరకు ఉంటుంది.
రాహుకాలం: ఉదయం 11: 01 నిమిషాల నుండి 12: 18 నిమిషాల వరకు.
అమావాస్య రాత్రి, ఇంటి దక్షిణ భాగంలో ఆవ నూనె లేదా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడాన్ని పిత్ర దీప దానం అంటారు. దీన్ని పాటించడం వల్ల వారి ఆశీర్వాదాలను పొందుతుందని భావిస్తారు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అలాగే పక్షులు, జంతువులకు ఆహారం పెట్టడం పితృ పక్షంలో చేసే ఆచారాలతో సమానం. ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం అందించాలి. వీటి ద్వారా పూర్వీకులు నైవేద్యాలను స్వీకరిస్తారని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ రోజున కాకులకు ధాన్యం, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకులు నేరుగా సంతృప్తి చెందుతారని నమ్ముతారు.
రావిచెట్టును దైవిక శక్తులకు, పూర్వీకులకు పవిత్ర స్థానంగా భావిస్తారు. అమావాస్య సాయంత్రం, రావిచెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన ఆవ నూనె దీపాన్ని వెలిగించండి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయండి. ఈ పరిహారం తీవ్రమైన పితృదోషాన్ని తగ్గిస్తుందని, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్ముతారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications