కోడెలను కడసారి చూసుకోకుండా కుట్ర.. భయభ్రాంతులకు గురిచేస్తున్న సర్కార్.. చంద్రబాబు
అమరావతి/హైదరాబాద్ : ఏపి మాజీ సభాపతి కోడెల శివప్రసాద రావు మృతి పట్ల టీడిపి శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా కోడెల శివ ప్రసాద్ మృతి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకూడా సరిగా లేదని టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రదబాబు నాయుడు ఘాటుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహాస్తామని ప్రకటించిన ఏపి ప్రభుత్వం గుంటూరులో 144 సెక్షన్ విధించండం విధించడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు పట్ల టీడిపి శ్రేణులే కాకుండా ఏపి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు బాబు పేర్కొన్నారు.

కోడెల అంత్యక్రియల్లో కూడా డ్రామాలెందుకు..! ఏపి సర్కార్ పై మండిపడ్డ చంద్రబాబు..!!
అంతే కాకుండా తమ ప్రియతమ నేతను కడసారి కూడా చూసుకోకుండా వైసిపి కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు అంటూనే ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసిపి నేతలు వారి దశ్చర్యలను కప్పి పుచ్చుకోవడానికి ఎన్ని నాటకాలు వేస్తున్నా, కోడెల విషయంలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేయాలని చూసినా ప్రజలకు జగన్ ప్రభుత్వం తాలూకా నిజస్వరూపం తెలిసిపోయిందని చంద్రబాబు ట్వీట్ చేసారు.

అభిమానులను కడచూపు చూసుకోకుండా చేసారు..! 144 సెక్షన్ ఎందుకన్న బాబు..!!
అంతే కాకుండా గుంటూరులో కోడెల శివప్రసాద్ ను కడసారి చూసుకోవడానికి వీలు లేకుండా కోడెల అభిమానులను ఎన్నో ఇబ్బందులకు గురి చేయడానికే నరసారావు పేటలో 144 సెక్షన్ విధించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా 30పోలీస్ యాక్ట్ ను కూడా అమలు చేసి టీడిపి శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష్యపూరిత రాజకీయాలను ప్రజలు ఎక్కువ కాలం సహించరని, సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

కోడెల మృతి పట్ల సీబీఐ విచారణ జరపాలి..! ఏపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన చంద్రబాబు..!!
కోడెల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడెల పై 19 కేసులు 2016, 17, 18 లలో పెట్టారన్నారు. విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా కేసులు పెట్టాలని రెచ్చకొట్టాడన్నారు. దీంతో కోడెలను మానసికంగా కుంగతిసారన్నారు. కోడెల మరణానికి ప్రభుత్వమే కారణమన్నారు. తనపై రాజశేఖర్ రెడ్డి 26 కేసులు పెట్టారు కానీ ఎక్కడా రుజువు చెయ్యలేక పోయారని బాబు తెలిపారు.

తనపై పెట్టిన కేసులు ఏమయ్యాయి..! నిరూపించలేక పోయారన్న టీడిపి ఛీఫ్..!!
కాగా తాను గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు చంద్రబాబు. కోడెల మరణం పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. జరిగిన వందరోజుల్లో జరిగిన డ్యామేజ్ పై విచారణ జరిపించాలన్నారు. పోలీస్ యంత్రాంగం సైతం ఎందుకు సరెండర్ అయిందో అర్థం కావడం లేదన్నారు. నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడని క్షోభని నేను అనుభవించానన్నారు. వ్యక్తుల మనోభావాలపై దెబ్బకొట్టాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి తాను మానసింకంగా చిత్ర వధ అనుభవిస్తున్నాని, ప్రభుత్వ చర్యలపై తాను పోరాటం ఉదృతం చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications