మరోసారి బటన్ నొక్కనున్న సీఎం వైఎస్ జగన్-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 27వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. రైతు భరోసా కింద నిధులను విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి- ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. దీనికోసం ఈ నెల 27వ తేదీన జిల్లాలోని తెనాలికి వెళ్లనున్నారాయన. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తెనాలిలోని జూనియర్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి జగన్ రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, స్థానిక వైసీపీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ ఆరిఫ్ హఫీజ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం, జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు.

రైతులను ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయడానికి జగన్ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా- ప్రధాని మంత్రి కిసాన్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తం 58 లక్షల మందికి పైగా రైతులను అర్హులుగా గుర్తించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు మూడు విడతల్లో 19,812.79 కోట్ల రూపాయల మేర పెట్టుబడి సాయాన్ని అందించింది ప్రభుత్వం. ఒక్కో రైతుకు 13,500 రూపాయలు చొప్పున అందుతుంది.
మూడు విడతల్లో 6,899.67 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించింది. ఇందులో రైతు భరోసా కింద 3,907.06 కోట్లను ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్ వాటా 2,992.61 కోట్ల రూపాయలు. నాలుగో విడత లబ్దిదారుల వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications