24 నుంచి పదో తరగతి హాల్ టికెట్లు: 3 నుంచి పరీక్షలు, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు
ఏప్రిల్ 3 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
హైదరాబాద్: ఏప్రిల్ 3 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సబిత శనివారం సమీక్షించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చి 24వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని మంత్రి సబిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థుల కోసం 2652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

కాగా, తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి సంస్కరణలు అమలవుతాయని పేర్కొంది.
ఒక్కో సబ్జెక్టులో పరీక్షలకు 80, పార్మెటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. సైన్స్ పేపర్లో ఫిజిక్స్, బయాలజీకి చెరి సగం మార్కులుంటాయని పేర్కొంది. సైన్స్ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించారు. మిగితా అన్ని సబ్జెక్టులకు మాత్రం 3 గంటల పరీక్షా సమయం ఉంటుందని స్పష్టం చేసింది.
-
గల్ఫ్ దేశాల్లో తెలుగువాళ్లు.. సీఎం రేవంత్ కీలక సూచనలు.. -
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం డిస్కౌంట్..?? సజ్జనార్ క్లారిటీ .. -
హైదరాబాద్ కు ఖమేనీతో సంబంధం.. ఏకంగా ఆ పేరు మీద రోడ్డే! -
విజయ్ విడాకుల రచ్చ వేళ.. పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్ !! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే ? -
T20 World cup: విండీస్ పై ఆడే టీమిండియా ఇదే..! రింకూ సస్పెన్స్ కు తెర..! -
అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
అంచనాలకు అందని బంగారం ధరలు- తలకిందులు -
ట్రంప్ ఆజ్ఞను ధిక్కరించిన సైన్యం.. AI తో ఇరాన్పై దాడి -
టీటీడీ వాడి అబ్బ సొత్తా- చంద్రబాబు చెబితే నిమిషంలో రాజీనామా చేస్తా- బీఆర్ నాయుడు -
IND vs WI: స్కోర్ చెప్పేసిన దాదా.. చెమటలు చిందిస్తున్న టీమిండియా












Click it and Unblock the Notifications