హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కలకలం: రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 8 మంది విద్యార్థులకు పాజిటివ్

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తక్కువ వస్తోన్న.. కరీంనగర్ జిల్లాలో మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అదీ కూడా విద్యార్థులకు సోకడం హైటెన్షన్ కలుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లి మండలం వంగరలోని పి.వి రంగారావు టి.ఎస్. రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా కలకలం రేపింది. స్కూల్‌లోని 8 మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

స్కూల్‌లోని 300 మంది విద్యార్థులకు కరోన పరీక్షలు నిర్వహించగా 8 మంది విద్యార్ధులు పాజిటివ్ వచ్చింది. విద్యార్ధులు వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్ తగ్గేంత వరకు విద్యార్థులను ఇంటికి పంపాలని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కోరారు. పాజిటివ్ వచ్చిన వారు తప్ప మిగతా విద్యార్థులంతా పాఠశాలలోనే ఉండాలని ఆదేశించారు.

8 students infected corona in residential school

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. నిపుణులు మాత్రం జనవరిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి మళ్లీ వేసవి ఎలా ఉంటుందోననే ఆందోళన ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎక్కడో.. ఎవరో కొందరు తీసుకోలేదు. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని విశ్వసించవచ్చు.

English summary
8 students infected corona in residential school at karimnagar district vangara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X