బంజారహిల్స్లో భారీ దొంగతనం.. 3కోట్ల విలువైన వజ్రాలు, నగదు మాయం
హైదరాబాద్ బంజారహిల్స్లో సోమవారం రాత్రి భారీ దొంగతనం చోటుసుకుంది. మాజీ ఎంపీ టీ సుబ్బిరాం రెడ్డి బంధువు అయిన ఉత్తమ్రెడ్డి ఇంట్లో ఈ చోరీ జరిగింది. చోరిలో భాగంగా మూడు కోట్ల రుపాయాల విలువైన వజ్రాలు, బంగారం,నగదు మాయమైనట్టు తెలుస్తోంది. కాగా టీ సుబ్బిరాం రెడ్డికి అన్న కొడుకు అయిన ఉత్తమ్రెడ్డితో పాటు ఇంట్లో కుటుంభ సభ్యులుపాటు ఎవరు లేకుండా బయటకు వెళ్లారు. ఈ సమయంలోనే చోరీ జరిగింది. బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్న ఉత్తమ్రెడ్డి కుటుంభసభ్యులు చోరీ జరిగినట్టు గుర్తించారు. దీంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన వాటిలో రెండు కోట్ల రుపాయాల విలువైన వజ్రాలు, బంగారం కాగా కోటి రుపాయాల వరకు నగదు ఉన్నట్టు పోలీసులకు తెలిపారు.
ఉత్తమ్రెడ్డి కుటుంభ సభ్యుల నుండి ఫిర్యాదు అందుకున్న బంజారహిల్స్ పోలీసులు హుటాహుటిన సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరీశీలిస్తున్నారు.

అంత్యంత కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు ఉంటే ప్రాంతంలో దొంగతనం జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాల రోజుల తర్వాత భారీ దొంగతనం జరగడంతో తెలిసిన వాళ్ల లేక ఇతర ప్రాంతాల నుండి వచ్చారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు..అయితే బంజారాహిల్స్ లాంటీ ప్రాంతాల్లో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు కూడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications