Hyderabad: మోమోస్ తిని మృతి చెందిన మహిళ..!
ఈ మధ్య హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వార సంతలు పెరిగిపోయాయి. ముఖ్యంగా బస్తీల్లో అంగడీ సాగుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు సంత ఉంటుంది. ఈ సంతలో ప్రధానంగా కూరగాయలు లతో పాటు పలు రకాల సమాన్లు అమ్ముతారు. ఈ అండీలో సమోసాలు అమ్ముతారు, మిఠాయి అమ్ముతారు, మంచూరియా, మిర్చీ బజ్జీ ఇల రకరకాలుగా విక్రయిస్తుంటారు. తాజాగా సంతలో మోమోస్ ఓ మహిళ మృతి చెందింది. పది మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లో జరిగింది.
అంగడిలో ఓ బండి వద్ద మోమోస్ తిన్న మహిళ తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. శుక్రవారం బంజారాహిల్స్ లోని నందినగర్, సింగాడిబస్తీ, గౌరీ శంకర్ కాలనీల్లో సంత జరిగింది. సంతలో కూరగాయలు కొనేందుకు చాలా మంది బస్తీ వాసులు వచ్చారు. సంతలో ఓ చోట మోమోస్ అమ్ముతున్నారు. ఇందులో సింగాడ కుంట బస్తీకి చెందిన రేష్మ బేగం, ఆమె పిల్లలు మోమోస్ తిన్నారు. డబ్బులు చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వీరి లాగానే చాలా మంది అక్కడ మోమోస్ తిన్నారు. అక్కడ మోమోస్ తిన్న వారందరికీ శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం నుంచి విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా సమీపంలోని ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో మోమోస్ తినడం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. అయితే ఈలోగా మోమోస్ తిన్న వారిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దాదాపు 20 మంది ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
ఇందులో రేష్మ బేగం పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆమెను నిమ్స్ కు తరలించారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది అయినా వైద్యులు వైద్యం అందిస్తున్న క్రమంలో రేష్మ బేగం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆస్పత్రి పాలైన వారిలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మోమోస్ విక్రయించిన వారిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. వాటిని విక్రయించిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మోమోస్ తో పాటు వాటిలోకి ఇచ్చే ఎగ్ మయోనీజ్, మిర్చి చట్నీల కారణంగా అస్వస్థతకు గురైనట్లు గా తెలుస్తోంది.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్











Click it and Unblock the Notifications