ఇంజిన్ ఆఫ్: హైదరాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: ఎయిర్ ఏషియాకు చెందిన ఓ విమానం మంగళవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. జైపూర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన i51543 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఈ క్రమంలో 78 మంది ప్రయాణికులతో వస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఛండీగఢ్-బెంగళూరు విమానంలో ఆ విమాన ప్రయాణికులను పంపించారు.

కాగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఏషియా తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. తమ పైలట్లు, సిబ్బంది అనుభవం కలిగిన వారు కావడంతో ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చారని తెలిపింది.
తమకు ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యమని వెల్లడించింది. విమానంలో సమస్యకు కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలిపింది. కాగా, విమానంలో ఒక ఇంజిన్ ఆఫ్ అయినట్లు సమాచారం. ఇంధనం లీకేజీ అయినట్లు తెలిసింది. ఇది ఇలావుంటే, దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications