Hyderabad: వివాహితకు మద్యం తాగించి లైంగిక దాడి.. ఆ తర్వాత వీడియోలతో బ్లాక్ మెయిల్..
మొబైల్ ఫోన్లు, ఇంటర్ నెట్ చౌకగా లభించడంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ సరైన దారిలో వాడితే మంచిదే కానీ.. చాలా మంది మొబైల్ ఫోన్లలో గేమ్ లు ఆడడం, ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండడం చేస్తుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు ఏర్పడి ప్రేమగా మారుతున్నాయి. చివరికి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్ లైన్ గేమ్ లో పరిచయమైన వివాహతకు మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి లైంగిక దాడి చేశాడు.
ఈ ఘటన హైదరాబాద్ లోని మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన యువతికి ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు అదే రాష్ట్రానికి చెందిన వాసాకుమార్ నర్సింహమూర్తి, జాషువా అనే వ్యక్తులు పరిచమయ్యారు. జాషువా ఏపీలో గ్రామ వాలింటీర్ గా పని చేస్తున్నాడు. ఆమె జాషువాకు దగ్గరై 2020లో అతడిని పెళ్లి చేసుకుంది. అయినా నర్సింహమూర్తి ఆమెను వదలలేదు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. రోజు ఫోన్ చేస్తూ.. చాటింగ్ చేసేవాడు. దీంతో బాధితురాలికి జాషువా మధ్య గొడవలు జరిగాయి.

దీంతో బాధితురాలు హైదరాబాద్ లోని అమీర్ పేటలో తన స్నేహితురాలి వద్దకు వచ్చింది. విషయం తెలుసుకున్న నర్సింహమూర్తి ఆమె వద్దకు వెళ్లాడు. జాషువా విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. రహ్మత్ నగర్ లో ఓ రూమ్ ను అద్దెకు తీసుకున్నాడు. బాధితురాలిని అక్కడకి పిలించాడు. ఆమెకు మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. అనతంరం ఆమెపై లైంగిక దాడి చేశారు. అంతేకాకుండా వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
దీంతో సొంతూరు వెల్లిన బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హైదరాబాదా మధురనగర్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు. మరో ఘటనలో మరిది వదినను హత్య చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలం సూరారం విశ్వకర్మకాలనీకి చెందిన సురేశ్, రేణుక 2016లో ప్రేమ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సురేష్ ఆటో డ్రైవర్ పని చేస్తున్నాడు. రేణుక రోజు కల్లు దుకాణానికి వెళ్లి కల్లు తాగేది. ఇంటిని పట్టించుకునేది కాదు.
ఈ క్రమంలో రేణుకకు ఓ అనాథ బాలిక పరిచయమైంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లిన రేణక.. బాలికకు, భర్తకు రహస్యంగా పెళ్లి చేసింది. ఫిబ్రవరి 5న రేణుక, ఆ బాలిక సురేష్ ను హత్య చేశారు. రేణుక జైలు కు వెళ్లి ఈ మధ్యే బెయిల్ పై బయటకు వచ్చింది. ఆమె పగ పెంచుకున్న మరిది నరేష్ రేణుకు హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గత మంగళవారం రాత్రి రేణకకు ఫోన్ చేసి రూ.200 కావాలని అడిగాడు. ఎందుకని ప్రశ్నించగా.. మందు తాగేందుకని బదులిచ్చాడు. దీంతో రేణుక తాను మద్యం తాగుతానని మరిది వద్దకు వద్దకు వచ్చింది. అప్పటికే అక్క సాయి, పద్మ, మరో బాలుడు మద్యం తాగుతున్నారు. ఇలా అందరు కలిసి మద్యం తాగారు. మిగతా నలురుగు కలిసి రేణుకను హత్య చేశారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications