Cyber Crime: కస్టమర్ కేర్ నుంచి అంటూ ఫోన్.. రూ.1.2 లక్షలు కోల్పోయిన బాధితుడు..
ఈ మధ్య సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సైబర్ నేరాలు అంతా కూడా ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి. అయితే కొందరు తెలియకుండా మోసపోతుంటే.. మరికొందరు అత్యాశకు పోయి డబ్బులు పొగోట్టుకుంటున్నారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ కు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వచ్చే జీతం సరిపోలేదని.. ఆన్ లైన్ పార్ట్ టైం జాబ్స్ కోసం సెర్చ్ చేసింది. సోషల్ మీడియాలో పార్ట్ టైం జాబ్స్ ప్రకటనలు కూడా చూసేవారు.
ఇలా ఒక రోజు ఓ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో తమ వద్ద పార్ట్ టైం ఉద్యోగం ఉంది. మీరు ఇష్టమొచ్చినప్పుడు పని చేయవచ్చు. ఇంటి నుంచి పని చేసుకోవచ్చు అని చెప్పాడు. తాము పంపే యూట్యూబ్ వీడియో లింక్ లు ఓపెన్ చేసి ఆ వీడియోలకు లైక్ కొట్టాలని చెప్పారు. ఒక్కో లైక్ కు రూ.50 చెల్లిస్తామని వివరించాడు. దీనికి ఆమె ఒకే చెప్పింది. దీంతో అతను కొన్ని యూట్యూబ్ వీడియో లింక్ లు పంపాడు. ఆమె లింక్ ఓపెన్ చేసి వీడియోలకు లైక్ కొట్టింది.

దీంతో ఆమెకు లైక్ లు కొట్టినందుకు వారు డబ్బులు పంపారు. ఇలా కొద్ది రోజులు వారు బాగానే డబ్బులు ఇచ్చారు. ఇదేదో బాగానే ఉదంకుని ఆమె వారిని నమ్మడం మొదలు పెట్టారు. దీంతో వారు తమ వద్ద పెట్టుబడి పెడితే డబుల్ ఇస్తామని చెప్పారు. దీంతో ఆమె కొంత మొత్తం లో డబ్బు పెట్టుబడి పెట్టారు. దీంతో వారు డబుల్ డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె భారీగా డబ్బు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేస్తే వారు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఆమె మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసం చేశారు. హైదరాబాద్కు చెందిన 62 ఏళ్ల వ్యక్తి కి ఫెడరల్ బ్యాంక్ నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని నటిస్తూ ఫోన్ చేశాడు. మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచినట్లు తెలిపాడు. ఇది నిజమేనని నమ్మిన వృద్ధుడు అవతలి వ్యకి.. కేవైసీ వివరాలు ఇచ్చాడు. ఓటీపీ కూడా చెప్పాడు. దీంతో కాసేపటికే వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.1,22,350 విత్డ్రా అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications