video: అమిత్ షా చెప్పులు మోసి, దేవుడి వద్ద ప్రమాణమా: కేటీఆర్
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. తమకే సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి స్వామి వారిని తాకి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వారు గుజరాత్కు గులాములకు బానిసలు అని సంజయ్పై హాట్ కామెంట్స్ చేశారు.
అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్.. ఆ దేవుడిని తాకడం ఏంటీ అన్నారు. దీంతో లక్ష్మీనరసింహా స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరారు. ఆ దేవుడిని కూడా అపవిత్రం చేశారని మండిపడ్డారు. పాప ప్రక్షాళన చేయాలని కేటీఆర్ అన్నారు.
మొయినాబాద్ ఫామ్ ఘటనతో తమకు సంబంధం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయగా... అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో యాదాద్రిలో ప్రమాణం చేసి భక్తుల మనోభావాలను బండి దెబ్బదీశారని కేటీఆర్ మండిపడ్డారు. ఇలా ప్రమాణాలు చేసుకుంటూ పోతే చట్టాలు, కోర్టుల అవసరం ఏముంది అన్నారు.
రేపిస్టులను జైలు నుంచి విడుదల చేసే బీజేపీ.. చట్టాలని గౌరవించే టీఆర్ఎస్ పై విమర్శలు చేయటమా? అని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారని వివరించారు.
video: అమిత్ షా చెప్పులు మోసి, దేవుడి వద్ద ప్రమాణమా: కేటీఆర్#bandisanjay #ktr pic.twitter.com/Ff1k5gXmfA
— oneindiatelugu (@oneindiatelugu) October 29, 2022