చార్మినార్ వద్ద బాంబ్..? ఫోన్ కాల్తో పోలీసుల అలర్ట్, తనిఖీలు
చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద బాంబు కలకలం రేగింది. బాంబు పెట్టామని ఆగంతుకుల నుంచి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. చార్మినార్ వద్ద, ఆ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు, హోటళ్లలో తనిఖీ చేశారు.
ఎక్కడా బాంబు లేకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది ఆకతాయిల కాల్ అయి ఉంటుందని భావిస్తున్నారు. చార్మినార్కు బాంబు బెదిరింపులు ఇదే కొత్త కాదు.గతంలో ఓసారి ఆకతాయిల కాల్తో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. ఇప్పుడు మరోసారి కాల్ వచ్చింది.
ఇటీవల మంగళూరులో ఆటోలో బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. మందుగుండుతో సహా.. పేలుడుకు సంబంధించిన సదరు వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి గతంలో కూడా ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఓ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చారని.. మరో కేసులో పరారీలో ఉన్నారట.