ఘోర ప్రమాదం: గుంతలో పడిన కారు, ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామ శివారులోని మల్లన్న గుడి వద్ద కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు గమనించి ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వ్యక్తిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

 car accident in Siddipet district: five killed, one injured.

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. మృతులు నల్గొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన సమ్మయ, స్రవంతి, లోకేష్, రాజమణి, భవ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు.

తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+